త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కేసీఆర్ జ‌గిత్యాల‌ స‌భ వేళ‌.. ఢిల్లీ బ‌యల్దేరి వెళ్లిన హ‌రీశ్ రావు

Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత (BRS Party) హ‌రీశ్ రావు (Harish Rao) ఢిల్లీ బ‌య‌ల్దేరి వెళ్లారు. నేడు జ‌గిత్యాల‌లో కేసీఆర్ భారీ బ‌హిరంగ స‌భ జ‌ర‌గ‌నున్న‌వేళ ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

D

Telangana | Published On Apr 20, 2026, 12.38 pm IST

Harish Rao | కేసీఆర్ జ‌గిత్యాల‌ స‌భ వేళ‌.. ఢిల్లీ బ‌యల్దేరి వెళ్లిన హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత (BRS Party) హ‌రీశ్ రావు (Harish Rao) ఢిల్లీ బ‌య‌ల్దేరి వెళ్లారు. నేడు జ‌గిత్యాల‌లో కేసీఆర్ భారీ బ‌హిరంగ స‌భ జ‌ర‌గ‌నున్న‌వేళ ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. కాళేశ్వ‌రం క‌మిష‌న్‌పై సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసేందుకే హ‌రీశ్ రావు ఢిల్లీ వెళ్లిన‌ట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వ‌రంపై ఎల్లుండి హైకోర్టు తీర్పు వెలువ‌రించ‌నున్న విష‌యం తెలిసిందే. దీంతో ఈ తీర్పు వ్య‌తిరేకంగా వ‌స్తే సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసేందుకు హ‌రీశ్ రావు సిద్ధ‌మ‌య్యార‌ట‌. అందుకే లాయ‌ర్ల‌తో భేటీ నేప‌థ్యంలో హ‌స్తిన‌కు వెళ్లిన‌ట్లుగా తెలిసింది.

పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కేసుల నేపథ్యంలో న్యాయపరమైన చర్చల కోసం బీఆర్ఎస్ త్రిసభ్య బృందం ఢిల్లీ వెళ్లిన‌ట్లు పార్టీ నేత‌లు తెలిపారు. హ‌రీశ్ రావుతోపాటూ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కూడా ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ ఆదేశాల మేర‌కు వారు ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌తో స‌మావేశం కానున్నారు. ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. అయితే, నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీల‌క స‌భ ఉండ‌గా హ‌రీశ్ రావు ఢిల్లీ వెళ్ల‌డం ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

Also Read..

వ‌చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తా.. జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజయ్

ద‌ళ‌ప‌తి విజ‌య్ విడాకుల కేసు వాయిదా - భ‌ర్త‌ ఆస్తిలో స‌గం భ‌ర‌ణంగా కావాల‌న్న సంగీత?

ఈసారి అక్ష‌య తృతీయ‌కు త‌గ్గిన బంగారం కొనుగోళ్లు.. పెట్టుబ‌డిదారుల నిరాస‌క్త‌త‌..

ట్యాగ్స్:

Advertisement
Advertisement