Ramchander Rao | ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ కొరత ఉండదు : బీజేపీ చీఫ్ రామచందర్ రావు
Ramchander Rao | చమురు కొరత పేరుతో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు మండిపడ్డారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలో ఎక్కడా ముడి చమురు కొరత లేదు. ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ కొరత ఉండు అనేది వాస్తవం అని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో ముడి చమురు కొరత లేనే లేదు
దేశానికి సరిపడా నిల్వలు ఉన్నాయి
47 దేశాల నుంచి చమురు కొంటున్నాం
కాంగ్రెస్ చర్యల వల్లే పెట్రోల్ ధరల పెంపు
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్ : చమురు కొరత పేరుతో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించాలని చూస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు మండిపడ్డారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలో ఎక్కడా ముడి చమురు కొరత లేదు. ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ కొరత ఉండు అనేది వాస్తవం అని ఆయన స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయలో రామచందర్ రావు సోమవారం మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతారో ఆయనకే తెల్వదు.. అది వేరే మాట. భారతదేశ ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలి. భయభ్రాంతులకు గురి చేయాలి అనేది రాహుల్ ఉద్దేశం. యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎక్కడ కూడా చమురు కొరత ఉండదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేశానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. దిగుమతులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. 2014కు ముందు భారతదేశం 14 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకునేది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక 47 దేశాల నుంచి మనం చమురు కొంటున్నాం. దాంట్లో రష్యా కూడా ఒక భాగం. ప్రస్తుతం యుద్ధం భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్పై ఎలాంటి ప్రభావం చూపదు. ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, పెట్రోల్ కొరత వస్తుందని కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది. ఇదంతా అబద్ధం. ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ కొరత రానే రాదు. 2012లో ఇరాన్ సప్లై ఆపింది. 2005లో యూపీఏ ప్రభుత్వం ఐఏఈఏ(అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ)లో ఇరాన్కు వ్యతిరేకంగా ఓటేసింది. దీంతో క్రూడ్ ఆయిల్ సప్లైని భారత్కు ఆపేసింది. ఈ పాపమంతా కూడా కాంగ్రెస్ పార్టీది. ఇరాన్కు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ నేతలు.. ఇవాళ ఇరాన్కు అనుకూలంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. నాడు ఇరాన్ క్రూడ్ ఆయిల్ను నిలిపివేయడంతోనే పెట్రోల్ ధరలు పెరిగాయని రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



