త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rain | తెలుగు రాష్ట్రాల‌కు అల‌ర్ట్‌.. మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

Heavy Rain | తెలుగు రాష్ట్రాల‌ను భార‌త వాతావ‌ర‌ణ శాఖ అల‌ర్ట్ చేసింది. ఉత్తర, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 నుంచి 7 రోజుల పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

S

Telangana | Published On Jul 3, 2026, 1.00 pm IST

Heavy Rain | తెలుగు రాష్ట్రాల‌కు అల‌ర్ట్‌.. మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: తెలుగు రాష్ట్రాల‌ను భార‌త వాతావ‌ర‌ణ శాఖ అల‌ర్ట్ చేసింది. ఉత్తర, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 నుంచి 7 రోజుల పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చ‌ని అంచ‌నా వేశారు.

40-50 కి.మీ వేగంతో గాలులు..

కాగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింద‌ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్ చెప్పారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అత్యంత‌ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో శుక్ర‌వారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కుర‌వొచ్చ‌ని చెప్పారు. మిగ‌తా జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉండ‌డంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.

Advertisement
Advertisement