త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoists | పీఎల్‌జీఏ డిప్యూటీ క‌మాండ‌ర్ సోది కేశాలు స‌హా.. పెద్ద సంఖ్య‌లో మావోయిస్టుల లొంగుబాటు!

Maoists | మావోయిస్టు మ‌రో కీల‌క నేత తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీఎల్‌జీఏ (PLGA) డిప్యూటీ క‌మాండ‌ర్ సోది కేశాలు అలియాస్ మ‌ల్లాతోపాటు 40 మంది మావోయిస్టులు (Maoists) స‌రెండ‌ర్ అయ్యారు.

G

Telangana | Published On Apr 6, 2026, 10.00 am IST

Maoists | పీఎల్‌జీఏ డిప్యూటీ క‌మాండ‌ర్ సోది కేశాలు స‌హా.. పెద్ద సంఖ్య‌లో మావోయిస్టుల లొంగుబాటు!
Advertisement

Maoists | త్రినేత్ర‌.న్యూస్‌: మావోయిస్టు మ‌రో కీల‌క నేత తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీఎల్‌జీఏ (PLGA) డిప్యూటీ క‌మాండ‌ర్ సోది కేశాలు అలియాస్ మ‌ల్లాతోపాటు 40 మంది మావోయిస్టులు (Maoists) స‌రెండ‌ర్ అయ్యారు. వారి నుంచి ఏకే 47స‌హా భారీగా ఆయుధాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగుబాటును పోలీసులు త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ది. మ‌ల్లాతోపాటు డివిజ‌న‌ల్ క‌మిటీ స‌భ్యుడు మంగ్తు, ఏరియా క‌మిటీ స‌భ్యుడు మ‌హేంద్ర‌, ప్ల‌టూన్ పార్టీ క‌మిటీ స‌భ్యుడు మిడియ‌మ్ రింకూ, ప్ల‌టూన్ స‌భ్యులు పొడియం చంద్రి, గోన్సె భిమ్‌, మ‌డ‌కం న‌రేశ్‌, పూణెమ్ ఐథే, సోది భీమ‌, మొడియం రీనా, సోది రంజిత్ లొంగిపోయిన వారిలో ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది.

సోది కేశాలు అలియాస్ సోది కేశ పీజీఎల్ఏ డిప్యూటీ క‌మాండ‌ర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ‌-ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దుల్లో త‌న ద‌ళాన్ని నిర్వ‌హిస్తున్నారు. బీఎన్‌పీసీ బెటాలియ‌న్ క‌మిటీలో కూడా ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. 2024 జ‌న‌వ‌రిలో ధ‌ర్మారం క్యాంపుపై జ‌రిగిన దాడిలో మ‌ల్లా ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నారు. 2025, న‌వంబ‌ర్‌లో అన్నారంలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు.

కాగా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఏపీ, జార్ఖండ్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులను అణ‌చి వేసేందుకు కేంద్ర‌ ప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే దీని లక్ష్యంగా పెట్టుకున్న‌ది. ఇందులో భాగంగా బ‌స్త‌ర్ ప్రాంతాన్ని మావోయిస్టు ర‌హిత ప్రాంతంగా లోక్‌స‌భ వేదిక‌గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

 

Advertisement

తాజావార్తలు

Advertisement