త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Food Poison | మ‌న్న‌నూరులో ఫుడ్ పాయిజ‌న్.. 30 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

Food Poison | నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా మ‌న్న‌నూరులోని ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజ‌న్ క‌ల‌క‌లం రేపింది. గురువారం ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ తిన్న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

S

Telangana | Published On Jul 9, 2026, 3.42 pm IST

Food Poison | మ‌న్న‌నూరులో ఫుడ్ పాయిజ‌న్.. 30 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌
Advertisement

Food Poison | త్రినేత్ర‌.న్యూస్ : నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా మ‌న్న‌నూరులోని ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజ‌న్ క‌ల‌క‌లం రేపింది. గురువారం ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ తిన్న 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. బాధిత విద్యార్థులంద‌రినీ చికిత్స నిమిత్తం ఆటోలో అచ్చంపేట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం బాధిత విద్యార్థుల ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

గురువారం ఉద‌యం అల్పాహారం తిన్న వెంట‌నే విద్యార్థులు క‌డుపునొప్పి, వికారంతో బాధ‌పడ్డారు. అప్ర‌మ‌త్త‌మైన స్కూల్ టీచ‌ర్లు, వార్డెన్ క‌లిసి విద్యార్థుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే రెసిడెన్షియ‌ల్ స్కూల్‌లో తాగ‌డానికి కూడా స‌రైన నీరు లేద‌ని విద్యార్థులు వాపోయారు.

Advertisement
Advertisement