త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gajwel | దూప అవుతుంద‌ని డ్రిప్ పైపులో నీళ్లు తాగితే.. ప్రాణం పోయింది..

Gajwel | సిద్దిపేట జిల్లా గ‌జ్వేల్ (Gajwel) మండ‌లం కొల్గూర్‌లో విషాదం చోటుచేసుకుంది. అమ్మానాన్న‌ల‌తో క‌లిసి పొలం ప‌నికి వెళ్లిన బాలుడు.. దూప అవుతుండంతో డ్రిప్ పైపులో (Drip Pipe) నుంచి వ‌స్తున్న నీటిని తాగాడు.

G

Telangana | Published On Jun 25, 2026, 10.03 am IST

Gajwel | దూప అవుతుంద‌ని డ్రిప్ పైపులో నీళ్లు తాగితే.. ప్రాణం పోయింది..
Advertisement

Gajwel | త్రినేత్ర‌.న్యూస్‌: సిద్దిపేట జిల్లా గ‌జ్వేల్ (Gajwel) మండ‌లం కొల్గూర్‌లో విషాదం చోటుచేసుకుంది. అమ్మానాన్న‌ల‌తో క‌లిసి పొలం ప‌నికి వెళ్లిన బాలుడు.. దూప అవుతుండంతో డ్రిప్ పైపులో (Drip Pipe) నుంచి వ‌స్తున్న నీటిని తాగాడు. దీంతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన అత‌డు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎందుకంటే ఆ డ్రిప్ పైపులో నుంచి వ‌స్తున్ నీళ్లు నానో యూరియా (Nano Urea) క‌లిపిన‌వి కావ‌డమే.

కొల్గూర్‌కు చెందిన గొడుగు రాంచ‌ర‌ణ్ (17) ఇంటీవ‌ల ప‌దో త‌ర‌గ‌తి పూర్తిచేశాడు. ఇంటి వ‌ద్దే ఉంటుండంతో ఈ నెల 13న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి పొలానికి వెళ్లాడు. ఈ క్ర‌మంలో దాహం కావ‌డంతో పొలంలోని డ్రిప్ పైపులో నుంచి వ‌స్తున్న నీటిని తాగాడు. అయితే ఆ పైపుల ద్వారా నానా యూరియాను క‌లిపిన నీటిని పంట‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. విష‌యం తెలియ‌క పోవ‌డంతో ఆ నీటిని తాగిన రాంచ‌ర‌ణ్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. దీంతో త‌ల్లిదండ్రులు అత‌డిని గ‌జ్వేల్ ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో మ‌ర‌ణిచాడు. ఒక్క‌గానొక్క కొడుకు కండ్ల ముందే చ‌నిపోవ‌డంతో త‌ల్లిదండ్రుల దుఃఖానికి అవ‌ధుల్లేవు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నాడు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement