Gajwel | దూప అవుతుందని డ్రిప్ పైపులో నీళ్లు తాగితే.. ప్రాణం పోయింది..
Gajwel | సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) మండలం కొల్గూర్లో విషాదం చోటుచేసుకుంది. అమ్మానాన్నలతో కలిసి పొలం పనికి వెళ్లిన బాలుడు.. దూప అవుతుండంతో డ్రిప్ పైపులో (Drip Pipe) నుంచి వస్తున్న నీటిని తాగాడు.
Gajwel | త్రినేత్ర.న్యూస్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) మండలం కొల్గూర్లో విషాదం చోటుచేసుకుంది. అమ్మానాన్నలతో కలిసి పొలం పనికి వెళ్లిన బాలుడు.. దూప అవుతుండంతో డ్రిప్ పైపులో (Drip Pipe) నుంచి వస్తున్న నీటిని తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎందుకంటే ఆ డ్రిప్ పైపులో నుంచి వస్తున్ నీళ్లు నానో యూరియా (Nano Urea) కలిపినవి కావడమే.
కొల్గూర్కు చెందిన గొడుగు రాంచరణ్ (17) ఇంటీవల పదో తరగతి పూర్తిచేశాడు. ఇంటి వద్దే ఉంటుండంతో ఈ నెల 13న తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో దాహం కావడంతో పొలంలోని డ్రిప్ పైపులో నుంచి వస్తున్న నీటిని తాగాడు. అయితే ఆ పైపుల ద్వారా నానా యూరియాను కలిపిన నీటిని పంటకు సరఫరా చేస్తున్నారు. విషయం తెలియక పోవడంతో ఆ నీటిని తాగిన రాంచరణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని గజ్వేల్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషయమించడంతో మరణిచాడు. ఒక్కగానొక్క కొడుకు కండ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అవధుల్లేవు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్లో సావర్కర్పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్లో సావర్కర్పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు





