త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | రాజీవ్ ర‌హ‌దారిపై ఘోర ప్ర‌మాదం.. చిన్నారి స‌హా ముగ్గురు మృతి

Road Accident | వృద్ధురాలి రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న ఓ వృద్ధ మ‌హిళ‌ను త‌ప్పించ‌బోయి అదుపుత‌ప్పిన కారు ఇంటిపైకి (Road Accident) దూసుకెళ్లింది. దీంతో చిన్నారి స‌హా ముగ్గురు మృతిచెందారు.

G

Telangana | Published On Jun 14, 2026, 10.07 am IST

Road Accident | రాజీవ్ ర‌హ‌దారిపై ఘోర ప్ర‌మాదం.. చిన్నారి స‌హా ముగ్గురు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: వృద్ధురాలి రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న ఓ వృద్ధ మ‌హిళ‌ను త‌ప్పించ‌బోయి అదుపుత‌ప్పిన కారు ఇంటిపైకి (Road Accident) దూసుకెళ్లింది. దీంతో చిన్నారి స‌హా ముగ్గురు మృతిచెందారు. ఈ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా కొండ‌పాక మండ‌లం దుద్దెడ‌లో (Duddeda) రాజీవ్ ర‌హ‌దారిపై జ‌రిగింది.

క‌రీంన‌గ‌ర్ నుంచి హైద‌రాబాద్ వైపు ఓ కారు వ‌స్తున్న‌ది. ఈ క్ర‌మంలో దుద్దెడ వ‌ద్ద రాజీవ్ ర‌హ‌దారిపై మ‌తిస్థిమితం లేని ఆరె రాధ‌వ్వ (60) అనే మ‌హిళ రోడ్డు దాటుతున్న‌ది. కారుకు అడ్డంగా వ‌చ్చిన ఆమెను త‌ప్పించ‌చే క్ర‌మంలో కారు అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది. దీంతో ఇంటి వ‌ద్ద అరుగుపై కూర్చున్న కెమ్మ‌సారం ల‌చ్చ‌వ్వ (65), మ‌రో చిన్నారిని ఢీకొట్టి క‌రెంటు స్తంభానికి గుద్దుకుని ఆగిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వృద్ధ మ‌హిళ‌లు మ‌ర‌ణించ‌గా, చిన్నారి తీవ్రంగా గాయ‌ప‌డింది. దీంతో చిన్నారిని హాస్పిట‌ల్‌కు త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యలోనే మృతిచెందింది. కాగా, కారులో ప్ర‌యాణిస్తున్న‌వారు స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. అయితే వారు కారును అక్క‌డే వ‌దిలి ప‌రార‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement