త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈనెల 28న నల్లగొండ జిల్లాలో (Nalgonda) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

G

Telangana | Published On Jun 25, 2026, 12.49 pm IST

Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈనెల 28న నల్లగొండ జిల్లాలో (Nalgonda) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.13వేల కోట్ల వ్యయంతో నిర్మించే ఆర్ అండ్ బీ హ్యామ్ రోడ్ల (HAM Roads) పనులకు ముఖ్య‌మంత్రి శంకుస్థాపన చేస్తారు. సీఎం పర్యటన నేప‌థ్యంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఈనెల 28న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నల్లగొండ జిల్లా కనగల్ మండలం చేరుకుంటారు. మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు కనగల్ మండలంలోని ఏఎంసీ మార్కెట్‌యార్డు వద్ద నిర్మించిన ‘హ్యామ్’ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంత‌రం రోడ్డు మార్గంలో న‌ల్ల‌గొండ‌కు చేరుకుంటారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొదటి ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు శంకుస్థాపన చేస్తారు. ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రసంగం అనంతరం స్వ‌యం స‌హాయ‌క మహిళా సంఘాలకు (SHG) చెక్కులను అందజేస్తారు.

 

 

Advertisement
Advertisement