త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rangareddy | రంగారెడ్డి జిల్లాలో 10 ఆవులు మృతి.. యూరియానే కార‌ణ‌మా..?

Rangareddy | రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండ‌లంలో విషాదం నెల‌కొంది. ఒక ప‌శువుల కొట్టంలో క‌ట్టేసి ఉంచిన‌ ప‌ది ఆవులు ఒకేసారి మృతి చెందాయి. దీంతో ఆవుల య‌జ‌మాని తీవ్ర ఆందోళ‌న‌కు గురై క‌న్నీరు పెట్టుకున్నాడు. ఆవుల మృతిపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

S

Telangana | Published On Jun 19, 2026, 3.41 pm IST

Rangareddy | రంగారెడ్డి జిల్లాలో 10 ఆవులు మృతి.. యూరియానే కార‌ణ‌మా..?
Advertisement

Rangareddy | త్రినేత్ర‌.న్యూస్ : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండ‌లంలో విషాదం నెల‌కొంది. ఒక ప‌శువుల కొట్టంలో క‌ట్టేసి ఉంచిన‌ ప‌ది ఆవులు ఒకేసారి మృతి చెందాయి. దీంతో ఆవుల య‌జ‌మాని తీవ్ర ఆందోళ‌న‌కు గురై క‌న్నీరు పెట్టుకున్నాడు. ఆవుల మృతిపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కుమ్మ‌రిగూడ గ్రామానికి చెందిన ఓ రైతుకు ప‌ది ఆవులు ఉన్నాయి. ఆ ఆవుల‌ను అన్నింటిని త‌న ప‌శువుల కొట్టంలో క‌ట్టేసి ఉంచాడు. ఇక జూన్ 19న తెల్ల‌వారుజామున ప‌శువుల కొట్టం వ‌ద్ద‌కు వెళ్లిన య‌జ‌మానికి ఆవులు చ‌నిపోయి ఉండ‌డంతో షాక్‌కు గుర‌య్యాడు. త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ఆవుల క‌ళేబ‌రాల‌ను ప‌శువుల ద‌వఖానాకు త‌ర‌లించారు. అయితే యూరియా క‌లిపిన నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల‌నే ఆవులు చ‌నిపోయి ఉంటాయ‌ని పోలీసులు అంచ‌నా వేశారు. ప‌శువుల కాప‌రి కూడా ప‌రారీలో ఉండ‌డంతో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌శువుల కాప‌రే నీళ్ల‌ల్లో యూరియా క‌లిపి ఉండొచ్చ‌ని అనుమానిస్తున్నారు. త‌న సొంత బిడ్డ‌ల్లాగా పెంచుకున్న ఆవులు చ‌నిపోవ‌డంతో య‌జ‌మాని క‌న్నీరు పెట్టుకున్నాడు.

Advertisement
Advertisement