త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | చెరువులో ప‌డ్డ ‘ఇయ‌ర్‌బ‌ర్డ్స్’.. నీటి మునిగిన ఇద్ద‌రు స్నేహితులు

Hyderabad | చెరువులో ప‌డ్డ ఇయ‌ర్ బ‌ర్డ్స్‌ను వెలికితీసేందుకు నీటిలోకి దిగిన ఇద్ద‌రు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. వారిని కాపాడేందుకు మ‌రో యువ‌కుడు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది.

S

Hyderabad | Published On Jun 16, 2026, 6.51 am IST

Hyderabad | చెరువులో ప‌డ్డ ‘ఇయ‌ర్‌బ‌ర్డ్స్’.. నీటి మునిగిన ఇద్ద‌రు స్నేహితులు
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : చెరువులో ప‌డ్డ ఇయ‌ర్ బ‌ర్డ్స్‌ను వెలికితీసేందుకు నీటిలోకి దిగిన ఇద్ద‌రు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. వారిని కాపాడేందుకు మ‌రో యువ‌కుడు ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఈ విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌ర శివారులోని తిమ్మాయిప‌ల్లి పెద్ద చెరువు వ‌ద్ద చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బొల్లారం ఆద‌ర్శ‌న‌గ‌ర్‌కు చెందిన కెవిన్ ఆంటోని(19) ఇంట‌ర్ పూర్తి చేశాడు. ఇక డిగ్రీలో చేరేందుకు కూడా సిద్ధ‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే ఆంటోనికి త‌ల్లిదండ్రులు కొత్త‌గా బైక్ కొనిచ్చారు. వ‌రుస‌కు సోద‌రుడైన వాలెంటైన్ టోనీ(18)ని కొత్త బైక్‌పై ఎక్కించుకుని తిమ్మాయిప‌ల్లి స‌మీపంలోని పెద్ద చెరువు వ‌ద్ద‌కు వెళ్లారు. వీరితో పాటు స్నేహితుడు అమెస్ జోస‌ఫ్ కూడా వెళ్లాడు.

అయితే ఇదే చెరువు వ‌ద్ద మూడు రోజుల క్రితం ఫొటోషూట్ చేస్తుండ‌గా ఈ ముగ్గురిలో ఒక‌రి ఇయ‌ర్ బ‌ర్డ్స్ నీటిలో ప‌డిపోయాయి. ఇక రూ. 1500 విలువ చేసే ఇయ‌ర్ బ‌ర్డ్స్‌ను వెలికితీసేందుకు య‌త్నించారు. ఈత రాకున్న‌ప్ప‌టికీ.. ముగ్గురు చెరువులో దిగారు. మొద‌ట వాలెంటైన్ టోనీ నీటిలోకి దిగాడు. అత‌ని వెనుకాలే ఆంటోని వెళ్లాడు. ఇద్ద‌రు నీట మునిగిపోతుండ‌గా.. జోస‌ఫ్ గ‌మ‌నించి కాపాడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ ఫ‌లితం లేకుండా పోయింది.

సమాచారం అందుకున్న కీసర సీఐ ఆంజనేయులు సిబ్బందితో చెరువు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కెవిన్‌ ఆంటోనీ మృతదేహం వెలికి తీశారు. గల్లంతైన వాలెంటైన్‌ టోనీ కోసం డీఆర్‌ఎఫ్‌ బృందం గాలించి వెలికితీసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement