Airtel | ప్రీపెయిడ్ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్టెల్.. ఆ 4 ప్లాన్లు తొలగింపు..
Airtel | టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ టారిఫ్ లైనప్లో కీలక మార్పులు చేసింది. రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరలతో ఉన్న నాలుగు మిడ్రేంజ్ రీఛార్జ్ ప్లాన్లను తొలగించింది. దీంతో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కేటలాగ్లో మధ్యస్థ ధరల ఆప్షన్లు తగ్గిపోగా, ప్రభావితమైన వినియోగదారులు అధిక ధరల ప్లాన్ల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Technology | Published On Aug 13, 2026, 4.52 pm IST
Airtel | టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ టారిఫ్ లైనప్లో కీలక మార్పులు చేసింది. రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరలతో ఉన్న నాలుగు మిడ్రేంజ్ రీఛార్జ్ ప్లాన్లను తొలగించింది. దీంతో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కేటలాగ్లో మధ్యస్థ ధరల ఆప్షన్లు తగ్గిపోగా, ప్రభావితమైన వినియోగదారులు అధిక ధరల ప్లాన్ల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఎంట్రీ లెవల్లో ఉన్న రూ.199, రూ.219 ప్లాన్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే రూ.299 రీఛార్జ్ ప్లాన్ను తొలగించడం ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన మిడ్ టియర్ ఆప్షన్ ఒకటి కనుమరుగైంది. ఈ రూ.299 ప్లాన్లో రోజుకు 1 జీబీ డేటాతోపాటు 28 రోజుల వ్యాలిడిటీ ఉండేది.
రూ.299కు బదులుగా రూ.349..
ఇప్పటివరకు రూ.299 ప్లాన్ను వినియోగించిన కస్టమర్లు ఇకపై రూ.349 ప్లాన్కు మారాల్సి ఉంటుంది. దాదాపు అదే రోజువారీ డేటా అవసరాలను కొనసాగించేందుకు రూ.349 ప్లాన్ను ఎంచుకుంటే, వినియోగదారులకు ధర సుమారు 16 శాతం పెరుగుతుంది. రూ.349 ప్లాన్లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఎయిర్టెల్ తాజా మార్పుల్లో రూ.299, రూ.579, రూ.619, రూ.649 ప్లాన్లను ప్రీపెయిడ్ కేటలాగ్ నుంచి తొలగించింది. అలాగే రూ.199, రూ.219 ఎంట్రీ లెవల్ ప్లాన్లు కొనసాగుతున్నాయి. రూ.299 ప్లాన్కు ప్రత్యామ్నాయంగా రూ.349 ప్లాన్ ప్రధాన అప్గ్రేడ్ ఆప్షన్గా మారింది.
పెట్టుబడులపై రాబడి కోసమే..
ఈ టారిఫ్ మార్పులపై భారతీ ఎయిర్టెల్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, యూజర్ ద్వారా వచ్చే సగటు ఆదాయం అంటే ఏఆర్పీయూ పెంచడం ఈ వ్యూహం ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా కనిపిస్తోంది. నెట్వర్క్ టెక్నాలజీ, స్పెక్ట్రమ్పై సంస్థ చేస్తున్న భారీ పెట్టుబడులకు మద్దతు ఇవ్వడంతోపాటు పెట్టుబడులపై పరిమిత రాబడిని అందించేందుకు ఈ మార్పులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఎయిర్టెల్ తాజా రీఛార్జ్ మార్పులు ఇప్పటికే ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్తోపాటు ఇతర ప్లాట్ఫామ్లలోనూ అమల్లోకి వచ్చాయి.
సంబంధిత వార్తలు

Airtel | ఎయిర్టెల్ 5జి హాట్స్పాట్ ఇంటర్నెట్ షేరింగ్పై గందరగోళం.. అసలు నిజం ఇదే..
జులై 18, 2026

Airtel | ఎయిర్టెల్ ఉచిత పర్ప్లెక్సిటీ ప్రో వాడుతున్నారా.. ఇలా చేయకపోతే రూ.17వేలు చెల్లించాల్సి వస్తుంది..
జులై 13, 2026

Airtel | రూ.349 ప్లాన్కే అన్లిమిటెడ్ 5జీ.. ఎయిర్టెల్ కస్టమర్లకు భారీ ఊరట..
జులై 4, 2026
తాజావార్తలు
- ●Supreme Court | ఉప్పు..చక్కెర.. ఫ్యాట్ ఎంతుందో.. జనానికి తెలిసేలా డిస్ ప్లే చేయండి? ప్యాకేజ్డ్ ఫుడ్ అంశంలో కేంద్రానికి సుప్రీం అల్టిమేటం
- ●Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. 'రాంప్'పై కదిలి: మోడల్స్గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు
- ●Janhvi Kapoor | నో గ్లామర్ - అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ - దీపికా, రష్మికలకు ధీటుగా!
- ●MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
- ●Stock Markets | వరుసగా నాలుగో సెషన్లోనూ మిశ్రమ ధోరణి.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●V Hanumantha Rao | చంచల్గూడ స్టీల్ బ్రిడ్జికి ఆ యోధురాలి పేరు పెట్టండి.. సీఎం రేవంత్కు వీహెచ్ లేఖ

Supreme Court | ఉప్పు..చక్కెర.. ఫ్యాట్ ఎంతుందో.. జనానికి తెలిసేలా డిస్ ప్లే చేయండి? ప్యాకేజ్డ్ ఫుడ్ అంశంలో కేంద్రానికి సుప్రీం అల్టిమేటం

Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. 'రాంప్'పై కదిలి: మోడల్స్గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు

Janhvi Kapoor | నో గ్లామర్ - అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ - దీపికా, రష్మికలకు ధీటుగా!

MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి



