త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Vaddiraju Ravichandra | డీల‌ర్ల‌కు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వ‌ద్దిరాజు విన‌తి

MP Vaddiraju Ravichandra | దేశ వ్యాప్తంగా ఉన్న వంట గ్యాస్ డీల‌ర్ల‌కు మార్జిన్ పెంచాల‌ని కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Aug 13, 2026, 4.11 pm IST

MP Vaddiraju Ravichandra | డీల‌ర్ల‌కు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వ‌ద్దిరాజు విన‌తి
Advertisement

MP Vaddiraju Ravichandra | త్రినేత్ర‌.న్యూస్ : దేశ వ్యాప్తంగా ఉన్న వంట గ్యాస్ డీల‌ర్ల‌కు మార్జిన్ పెంచాల‌ని కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర డిమాండ్ చేశారు. ఈ మేర‌కు గురువారం మ‌ధ్యాహ్నం పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో పెట్రోలియం, స‌హ‌జ‌వాయువు శాఖ‌ల మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీని ఎంపీ వ‌ద్దిరాజు క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

దేశంలోని పెట్రోలియం, డీజిల్, సహజవాయువు (వంటగ్యాస్)డీలర్లు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. యునైటెడ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్‌కు చెందిన తెలంగాణ,కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీలర్ల మార్జిన్ (కమీషన్)పెంచాల్సిందిగా తనతో పాటు స్థాయీ సంఘం ఛైర్మన్ సునీల్ దత్తాత్రే తర్కరేను ఇటీవల కలిసి కోరడాన్ని కేంద్ర మంత్రి దృష్టికి ఎంపీ రవిచంద్ర తెచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లకు 8 ఏళ్ల కిందట ఖరారు చేసిన మార్జిన్ ఇప్పటికీ కొనసాగుతున్నదని, మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ వద్దిరాజు వివరించగా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సానుకూలంగా స్పందించారు.

Advertisement
Advertisement