Samsung | శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకు భారీ డిమాండ్.. 72 గంటల్లోనే 2.71 లక్షల ప్రీ ఆర్డర్లు..
Samsung | ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజ సంస్థ శాంసంగ్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా తన 8వ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సిరీస్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా విశేష రీతిలో స్పందన లభిస్తోంది. భారత్లోనూ ఈ ఫోన్లకు డిమాండ్ భారీగా ఏర్పడింది. ఈ మేరకు సంస్థ వివరాలను వెల్లడించింది.
Technology | Published On Jul 30, 2026, 1.21 pm IST
Samsung | ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజ సంస్థ శాంసంగ్ ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా తన 8వ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సిరీస్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా విశేష రీతిలో స్పందన లభిస్తోంది. భారత్లోనూ ఈ ఫోన్లకు డిమాండ్ భారీగా ఏర్పడింది. ఈ మేరకు సంస్థ వివరాలను వెల్లడించింది. ఈ నెల 22న విడుదలైన గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 8 మోడళ్లు విడుదలైన తొలి 72 గంటల్లోనే 2.71 లక్షలకు పైగా ప్రీ ఆర్డర్లను నమోదు చేశాయి. ఈ గణాంకాలు భారత్లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై వినియోగదారుల ఆసక్తి వేగంగా పెరుగుతోందని సూచిస్తున్నాయి. గతేడాది విడుదలైన గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 7 సిరీస్ ఇదే స్థాయి ప్రీ ఆర్డర్లను సాధించడానికి 15 రోజులు పట్టగా, ఈసారి కేవలం 3 రోజుల్లోనే ఆ మైలురాయిని దాటడం విశేషం. దీంతో ఫోల్డబుల్ విభాగంలో శాంసంగ్ విక్రయాలు మరింత వేగంగా పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
టియర్ 2 నగరాల నుంచి సైతం డిమాండ్..
ఈసారి మరో ఆసక్తికరమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మొత్తం ప్రీ ఆర్డర్లలో 45 శాతం టియర్ 2 నగరాలు, చిన్న ప్రాంతీయ పట్టణాల నుంచే నమోదయ్యాయని శాంసంగ్ వెల్లడించింది. దీంతో ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని కంపెనీ పేర్కొంది. ప్రారంభ స్పందనను దృష్టిలో ఉంచుకుని, ఈ ఎనిమిదో తరం ఫోల్డబుల్ సిరీస్ ప్రీ ఆర్డర్లు ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన కంపెనీ ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్26 సిరీస్ స్థాయికి చేరుకునే అవకాశముందని శాంసంగ్ అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు. ధరల విషయానికి వస్తే.. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ప్రారంభ ధర రూ.1,99,999గా, జడ్ ఫోల్డ్ 8 ప్రారంభ ధర రూ.1,79,999గా, జడ్ ఫ్లిప్ 8 ప్రారంభ ధర రూ.1,24,999గా ఉంది.
ప్రత్యేక ఆఫర్లు సైతం..
వినియోగదారులకు కొనుగోలు సౌలభ్యం కల్పించేందుకు శాంసంగ్ ప్రత్యేక ఆర్థిక పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని మోడళ్లపై పరిశ్రమలో తొలిసారిగా 30 నెలల జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ప్రకటించింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు ఆగస్టు 8 నుంచి విక్రయాలకు అందుబాటులోకి రానున్నాయి.
సంబంధిత వార్తలు

Samsung Galaxy Z Flip8 | శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్8 వచ్చేసింది.. స్లిమ్ డిజైన్, ఏఐ ఫీచర్లతో ఆకట్టుకునే ఫ్లిప్ ఫోన్..
జులై 23, 2026

Samsung Galaxy Z Fold 8 | శాంసంగ్ నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్లు.. ఫీచర్లు అద్భుతం..
జులై 23, 2026

Samsung Galaxy S25 Edge | రూ.47 వేల తగ్గింపుతో లభిస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్.. అమెజాన్లో భారీ డీల్..
జులై 14, 2026
తాజావార్తలు
- ●Xi Jinping | భారత పర్యటనకు చైనా అధ్యక్షుడు.. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి
- ●Cyber Cheeting | ఎక్కువ లాభాలోస్తాయని ఆశ చూపారు.. అప్పనంగా రూ.33 లక్షలు కాజేశారు
- ●OnePlus N6x | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్ప్లస్ ఎన్6ఎక్స్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●Delhi Police | మా నాన్న యూనిఫామ్ రక్తంతో తడిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి.. మీడియా ముందుకొచ్చిన గాయపడ్డ పోలీసు కుటుంబాలు
- ●Income Tax | రూ.50వేలకు పైగా విలువైన వస్తువును లేదా డబ్బును గిఫ్ట్గా అందుకున్నారా.. ఇలా చేస్తే పన్ను ఉండదు..
- ●Dasoju Sravan Kumar | బంకర్ బెడ్ల కుంభకోణంపై రేవంత్ ప్రభుత్వానికి నోటీసులు.. ‘పెద్ది’ పోరాట ఫలితమే

Xi Jinping | భారత పర్యటనకు చైనా అధ్యక్షుడు.. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి

Cyber Cheeting | ఎక్కువ లాభాలోస్తాయని ఆశ చూపారు.. అప్పనంగా రూ.33 లక్షలు కాజేశారు

OnePlus N6x | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్ప్లస్ ఎన్6ఎక్స్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Delhi Police | మా నాన్న యూనిఫామ్ రక్తంతో తడిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి.. మీడియా ముందుకొచ్చిన గాయపడ్డ పోలీసు కుటుంబాలు



