Messi | ఇండియా టూర్కు మెస్సికి రూ.89 కోట్లు ఇచ్చారు.. వెల్లడించిన నిర్వాహకుడు..
Messi | ఫుట్బాల్ దిగ్గజ ప్లేయర్ లియోనెల్ మెస్సి కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం పర్యటన రసాభాసగా మారిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయనను చుట్టు ముట్టడం, టచ్ చేయడం, ప్రైవసీకి భంగం కలిగించేలా వ్యవహరించడంతోనే మెస్సి కోల్కతాలో సమయం గడపకుండా వెళ్లిపోయాడని అర్థం అయింది.
Messi | ఫుట్బాల్ దిగ్గజ ప్లేయర్ లియోనెల్ మెస్సి కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియం పర్యటన రసాభాసగా మారిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయనను చుట్టు ముట్టడం, టచ్ చేయడం, ప్రైవసీకి భంగం కలిగించేలా వ్యవహరించడంతోనే మెస్సి కోల్కతాలో సమయం గడపకుండా వెళ్లిపోయాడని అర్థం అయింది. అయితే ఇదే విషయాన్ని ఆ ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా కూడా పోలీసులకు తెలిపాడు. కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తులు తనను బలవంత పెట్టారని, దీంతో అనుకున్న దాని కన్నా మూడు రెట్లు ఎక్కువ మొత్తంలో యాక్సెస్ కార్డులను ఇవ్వాల్సి వచ్చిందని అన్నాడు. దీని వల్ల చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మెస్సి ఈవెంట్కు వచ్చారని, అలాగే అపరిచిత వ్యక్తులు మెస్సిని తాకారని, అందుకనే మెస్సి అసంతృప్తికి గురై ఈవెంట్ నుంచి హఠాత్తుగా వెళ్లిపోయాడని దత్తా వివరించాడు. కాగా దత్తా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
ఇండియా టూర్కు గాను మెస్సికి రూ.89 కోట్లు చెల్లించామని దత్తా పోలీసులకు తెలిపాడు. అలాగే మరో రూ.11 కోట్లను ప్రభుత్వానికి పన్నుగా చెల్లించినట్లు వివరించాడు. కాగా దత్తా బ్యాంకు ఖాతాలలో ఉన్న రూ.22 కోట్లను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. అయితే మెస్సికి చెల్లించిన మొత్తంలో తనకు టిక్కెట్ల అమ్మకాలు, స్పాన్సర్స్ ద్వారా 60 నుంచి 70 శాతం మాత్రమే రికవరీ అయ్యాయని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) పోలీసులకు దత్తా వివరించాడు. కానీ దత్తా చెబుతున్న ఈ విషయాన్ని పోలీసులు మాత్రం విశ్వసించడం లేదు. ఈ ఈవెంట్ ద్వారా ఇంకా భారీ మొత్తంలోనే దత్తాకు వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఈవెంట్ను నిర్వహించేందుకు బ్లాక్ మనీని ఉపయోగించారా..? అన్న కోణంలోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా డిసెంబర్ 13న కోల్కతాలో తన విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరించిన మెస్సి ఆ తరువాత సాల్ట్ లేక్ స్టేడియంకు అభిమానులను కలిసేందుకు వెళ్లాడు. కానీ కొన్ని నిమిషాల్లోనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో మెస్సి అక్కడి నుంచి అర్థాంతరంగా వెళ్లిపోగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియంలోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అటు మెస్సికి, ఇటు అభిమానులకు క్షమాపణలు తెలపడంతోపాటు వెంటనే సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించగా పోలీసులు ఆ తరువాత కొన్ని గంటల్లోనే నిర్వాహకుడు శతద్రు దత్తాను అరెస్టు చేశారు. అతనిపై రెండు కేసులను వారు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్కు టిక్కెట్ల సొమ్మును వెనక్కి ఇచ్చేస్తామని దత్తా ఇప్పటికే తెలిపాడు. కాగా శుక్రవారం దత్తా ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు కూడా చేపట్టారు. అయితే కోల్కతా ఈవెంట్కు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో నెలకొన్న అవకతవకలపై దత్తా ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదని సిట్ అధికారులు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Lionel Messi Wine and Sprite Drink | వైన్లో స్ప్రైట్ కలుపుకొని తాగిన మెస్సీ.. సర్రున ఎగబాకిన కోకకోలా స్టాక్స్
జనవరి 12, 2026

Anant Ambani | మెస్సికి రూ.10.91 కోట్లు విలువ చేసే వాచ్ను గిఫ్ట్గా ఇచ్చిన అనంత్ అంబానీ..!
డిసెంబర్ 17, 2025

Minister Aroop Biswas | కోల్కతా మెస్సి ఈవెంట్ దెబ్బకు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా..
డిసెంబర్ 17, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



