త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

సింపుల్ పాస్ ఇవ్వడం కూడా రాదా? రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సెటైర్లు

సీఎంతో మెస్సీ మ్యాచ్ ఆడిన దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఇప్పుడు రాజకీయ విమర్శలకూ దారితీసింది. మెస్సీకి బంతిని పాస్ చేయడంలో కూడా రేవంత్ రెడ్డి తడబడ్డారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సెటైర్లు వేశారు.

J

Hyderabad | Published On Dec 16, 2025, 11.11 am IST

సింపుల్ పాస్ ఇవ్వడం కూడా రాదా? రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సెటైర్లు
Advertisement

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లో కూడా పర్యటించిన విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. సీఎంతో మెస్సీ మ్యాచ్ ఆడిన దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఇప్పుడు రాజకీయ విమర్శలకూ దారితీసింది. మెస్సీకి బంతిని పాస్ చేయడంలో కూడా రేవంత్ రెడ్డి తడబడ్డారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సెటైర్లు వేశారు.

ఫుట్‌బాల్ కోసం రెండు సార్లు పరిగెత్తిన మెస్సీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మెస్సీతో కాసేపు ఆట ఆడారు. అప్పుడే సింపుల్ పాస్ కూడా మెస్సీకి రేవంత్ రెడ్డి ఇవ్వలేకపోయారని ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కిరణ్ రిజిజు.. రేవంత్ రెడ్డిపై చురకలు అంటించారు. ఒక సింపుల్ పాస్ ఇవ్వడం కూడా చేతకాలేదు. ప్రపంచ స్థాయి క్రీడాకారుడిని ఇలా పరిగెత్తించడం కరెక్టేనా? అంటూ కిరణ్ రిజిజు ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలోనే ఈ ఘటన జరగడాన్ని కేంద్ర మంత్రి పరోక్షంగా ప్రస్తావించారు.

సోషల్ మీడియాలో రచ్చ

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్త రాజకీయ రంగు పూసుకుంది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి ఎద్దేవా చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. బీజేపీ నేతలు ఈ వీడియోను అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్‌ని రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదని హితువు పలుకుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement