త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Study | భూమి అంతం ఎప్పుడు..? అంచనా వేసిన సూపర్‌ కంప్యూటర్‌..!

Study | భూమి అంతం ఎప్పుడు? ఈ ప్రశ్న మానవాళిని దశాబ్దాలుగా వెంటాడుతోంది. 2012లో మాయన్ క్యాలెండర్ ముగిసిన నేపథ్యంలో ప్రపంచం అంతం ప్రచారం జరిగింది. అలాగే, 2032లో గ్రహశకలం భూమిని ఢీకొంటుందనే ఊహాగానాలకు సంబంధించి వార్తలు ప్రజల్లో భయంతో పాటు ఆసక్తిని రేకెత్తించాయి. అలాగే, అనేక భవిష్యత్‌ అంచనాలు వెలుగు చూశాయి.

P

Science | Published On Apr 21, 2026, 4.00 pm IST

Study | భూమి అంతం ఎప్పుడు..? అంచనా వేసిన సూపర్‌ కంప్యూటర్‌..!
Advertisement

Study | భూమి అంతం ఎప్పుడు? ఈ ప్రశ్న మానవాళిని దశాబ్దాలుగా వెంటాడుతోంది. 2012లో మాయన్ క్యాలెండర్ ముగిసిన నేపథ్యంలో ప్రపంచం అంతం ప్రచారం జరిగింది. అలాగే, 2032లో గ్రహశకలం భూమిని ఢీకొంటుందనే ఊహాగానాలకు సంబంధించి వార్తలు ప్రజల్లో భయంతో పాటు ఆసక్తిని రేకెత్తించాయి. అలాగే, అనేక భవిష్యత్‌ అంచనాలు వెలుగు చూశాయి. బల్గేరియన్‌కు చెందిన బాబా వంగా, ఫ్రెంచ్ ప్రవక్త నోస్ట్రడామస్ వంటి వారు కూడా భూమి అంతంపై తమ అంచనాలు వెల్లడించారు. అయితే ఈ అంచనాల్లో ఎంతవరకు నిజం ఉందన్నదానిపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక శాస్త్రీయ అధ్యయనం భూమి అంతానికి సంబంధించిన స్పష్టమైన కాలక్రమాన్ని సూచిస్తోంది. గతంలో అనేక ఊహాగానాలు, ప్రవచనాలు వినిపించినప్పటికీ, తాజా శాస్త్రీయ అధ్యయనాలు మాత్రం భూమి భవిష్యత్తుపై మరింత స్పష్టతనిస్తున్నాయి.

యుద్ధాలో.. గ్రహశకలాలు ఢీకొట్టడం వల్లో కాదు..

సూపర్ కంప్యూటర్ మోడలింగ్ ఆధారంగా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ పరిశోధన ప్రకారం.. భూమి యుద్ధాలు లేదంటే గ్రహశకల ఢీకొనడం వల్ల కాదని, సూర్యుడి సహజ పరిణామం కారణంగా దీర్ఘకాలంలో జీవానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తేలింది. ఈ అధ్యయనాన్ని శాస్త్రవేత్తలు కజుమి ఒజాకి, క్రిస్టోఫర్ రైన్‌హార్డ్ నిర్వహించారు. వారి విశ్లేషణ ప్రకారం భూమిపై జీవం శాశ్వతం కాదు. జీవానికి అత్యంత కీలకమైన ఆక్సిజన్ భవిష్యత్తులో క్రమంగా తగ్గిపోతుందని వారు పేర్కొన్నారు. కాలక్రమేణా సూర్యుడి ఉష్ణోగ్రత, ప్రకాశం పెరుగుతూ భూమి వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీని ఫలితంగా సహజ సమతుల్యం దెబ్బతిని, ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. సముద్ర జలాలు ఆవిరైపోవడం ప్రారంభమై, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు క్రమంగా నశించే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో శాస్త్రవేత్తలు భూమిపై జీవం మరో 2 బిలియన్ సంవత్సరాల వరకు కొనసాగుతుందని అంచనా వేశారు. అయితే, తాజా అధ్యయనం ఈ కాలాన్ని సుమారు ఒక బిలియన్ సంవత్సరాలకు పరిమితం చేసింది. ఆ సమయానికి భూమి వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు ఒక శాతం కంటే తక్కువకు పడిపోవచ్చని, ఫలితంగా మనుషులు, జంతువులు, మొక్కలు జీవించడం అసాధ్యమవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

సూపర్ కంప్యూటర్ అంచనాలు..

సూపర్ కంప్యూటర్ మోడల్ ప్రకారం భవిష్యత్తులో సూర్యకాంతి, వేడి తీవ్రంగా పెరుగుతాయి. దాని ప్రభావంతో భూమి వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సముద్ర జలాలు ఆవిరైపోవడం ప్రారంభమవుతుంది. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు క్రమంగా నశిస్తాయి. ఫలితంగా గాలిలో ఆక్సిజన్ స్థాయి వేగంగా పడిపోతుంది. ఈ పరిస్థితి కొనసాగితే శ్వాస తీసుకోవడం అసాధ్యమవుతుంది. తద్వారా భూమిపై ఉన్న జీవజాతులలో చాలా భాగం అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన ప్రకారం సుమారు ఒక బిలియన్ సంవత్సరాల తర్వాత భూమిపై ఆక్సిజన్ స్థాయి ఒకశాతం కంటే తక్కువకు పడిపోతుంది. ఇది ‘గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్’కు ముందు ఉన్న పరిస్థితులను తలపిస్తుంది. ఆ కాలంలో కూడా భూమిపై ఆక్సిజన్ స్థాయులు చాలా తక్కువగా ఉండేవి. భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడితే కొన్ని సూక్ష్మజీవులు మాత్రమే జీవించగలవు. మనుషులు, జంతువులు, మొక్కలు ఈ మార్పులను తట్టుకోలేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని భూమి సహజ జీవచక్రం ముగింపుగా పరిగణిస్తున్నారు.

మనుషులకు ఉన్న మార్గం ఏంటీ?

ఈ అంచనాలు భయానకంగా అనిపించినప్పటికీ, ఇది తక్షణ ప్రమాదం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇది తక్షణ ప్రమాదం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామం సుమారు ఒక బిలియన్ సంవత్సరాల తర్వాతే సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలు, ఇతర గ్రహాలపై నివాస అవకాశాల అన్వేషణ, ఆక్సిజన్ కొరతను ఎదుర్కొనే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ వంటి తక్షణ సమస్యలపై దృష్టి సారించడం అత్యవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement
Advertisement