త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy Teachers Day | వచ్చే ఎన్నికల్లో నాకు ఎన్ని మార్కులు వేయాలో మీరే డిసైడ్ చేయండి

ఉపాధ్యాయ దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి టీచర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. పదేళ్లలో విధ్వంసమైన విద్యావ్యవస్థను బాగుచేద్దామని, రెండేళ్లు టైమ్ ఇవ్వాలని కోరారు.

J

Rangareddy | Published On Sep 5, 2026, 1.11 pm IST

CM Revanth Reddy Teachers Day | వచ్చే ఎన్నికల్లో నాకు ఎన్ని మార్కులు వేయాలో మీరే డిసైడ్ చేయండి
Advertisement
  • కొడంగల్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
  • 55 రోజుల్లోనే 10 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేశామని, 25 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చామని వెల్లడి
  • గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.6 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను క్లియర్ చేశామని స్పష్టీకరణ
  • రాజకీయ నాయకుల వలలో పడి రోడ్డెక్కొద్దని, రెండేళ్లలో సమస్యలన్నీ తీరుస్తానని ఉపాధ్యాయులకు హామీ

CM Revanth Reddy Teachers Day | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ విద్యావ్యవస్థను దేశానికే దిక్సూచిగా మారుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన.. టీచర్ల సమస్యలు, ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విద్యాభివృద్ధిలో టాప్ గేర్

ప్రజా ప్రభుత్వం వచ్చాక విద్యాభివృద్ధిలో రాష్ట్రం 28వ స్థానం నుంచి 17వ ర్యాంకుకు చేరుకుందని సీఎం గర్వంగా చెప్పారు. రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో 88 వేల మంది విద్యార్థులు పెరగడం కేవలం టీచర్ల కృషితోనే సాధ్యమైందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో 95 శాతం అడ్మిషన్లు (Admissions) పూర్తయ్యాయని, టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో రాష్ట్రం చాలా ఫాస్ట్‌గా ముందుకెళ్తోందని వివరించారు.

CM Revanth Reddy's Big Promise to Teachers Give Me 2 Years

రికార్డు స్థాయిలో ప్రమోషన్లు, పోస్టింగ్‌లు

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎడ్యుకేషన్ కమిషన్ (Education Commission) ఏర్పాటు చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం 55 రోజుల్లోనే మెగా డీఎస్సీ (DSC) ద్వారా 10,006 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, 25,950 మందికి ప్రమోషన్లు (Promotions) ఇచ్చామని గుర్తుచేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా 34 వేల మందికి పైగా బదిలీలు (Transfers) చేశామని, వివాదాస్పద 317 జీవో సమస్యను కూడా పరిష్కరించామన్నారు.

గత ప్రభుత్వంపై ఫైర్

గత పదేళ్లలో విద్యావ్యవస్థను నాశనం చేశారని సీఎం మండిపడ్డారు. ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ (Retirement benefits) ఇవ్వకుండా పెండింగ్ పెట్టి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏకంగా రూ.6 వేల కోట్లు చెల్లించిందని స్పష్టం చేశారు. అలాగే, టీచర్లను ప్రభుత్వ ఖర్చులతో విదేశాలకు పంపి స్టడీ టూర్లు చేయించిన ఘనత కూడా తమదేనన్నారు.

CM Revanth Reddy's Big Promise to Teachers Give Me 2 Years

బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ వద్దు.. రెండేళ్లు టైమ్ ఇవ్వండి

రాజకీయ నాయకుల ట్రాప్‌లో పడి టీచర్లు రోడ్డెక్కొద్దని సీఎం సున్నితంగా హెచ్చరించారు. "నేనే మీ రిప్రజెంటేటివ్‌గా (Representative) ఉండి సమస్యలు పరిష్కరిస్తా. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా కోరుతున్నా.. నాకు రెండేళ్లు టైమ్ ఇవ్వండి. ఈ రెండేళ్లు పిల్లల భవిష్యత్ కోసం డెడికేటెడ్‌గా (Dedicated) పనిచేయండి. రెండేళ్ల తర్వాత మీ సమస్యలు తీరకపోతే.. ఎలక్షన్స్‌లో నాకు ఎన్ని మార్కులు వేయాలో మీరే డిసైడ్ చేయండి" అని సీఎం స్పష్టం చేశారు.

CM Revanth Reddy's Big Promise to Teachers Give Me 2 Years

నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యను ప్రైవేట్‌కు ధీటుగా బలోపేతం చేసేందుకు అందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 123 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి, వారికి అవార్డులు అందజేశారు.

Advertisement
Advertisement