త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం

విద్యార్థుల్లో కుల వివక్షను రూపుమాపేందుకు విద్యాశాఖలో భారీ సంస్కరణలు తెస్తున్నామని జాతీయ ఎస్సీ కమిషన్‌కు సీఎం రేవంత్ తెలిపారు. ఆ కీలక నిర్ణయాలివే!

J

Telangana | Published On Jul 13, 2026, 9.17 pm IST

CM Revanth Reddy | ఎస్సీలకు వారి జనాభా శాతం కంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాం
Advertisement
  • ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా బృందం భేటీ
  • కుల వివక్షను నిర్మూలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, కొత్తగా 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్' ఏర్పాటు
  • రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి, పక్కాగా అమలు చేస్తున్నట్లు వెల్లడి
  • ఎస్సీల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి తగిన సహకారం, నిధులు అందేలా చూడాలని కమిషన్‌కు సీఎం విజ్ఞప్తి

CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ విద్యా రంగంలో (Education sector) తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు, కుల వివక్ష నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక విషయాలు వెల్లడించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో జాతీయ ఎస్సీ కమిషన్ (National SC Commission) చైర్‌పర్సన్ కిషోర్ మక్వానా, ఇతర సభ్యులతో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, విద్యా పథకాలను కమిషన్‌కు సమగ్రంగా వివరించారు.

విద్యార్థుల్లో కుల వివక్షకు చెక్!

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ (YIIRS) నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. వివిధ కులాలు, మతాలకు చెందిన విద్యార్థులంతా ఒకేచోట చదువుకోవడం వల్ల వారి మధ్య చిన్నప్పటి నుంచే ఎలాంటి కుల వివక్ష (Caste discrimination) ఉండదన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అకడమిక్ ఇయర్ (Academic year) నాటికి ఈ బడులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

CM Revanth Reddy Explains Telangana's Education Reforms to SC Commission

కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

నర్సరీ (Nursery) నుంచి 12వ తరగతి వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే లక్ష్యంతో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'ను (Telangana Public Schools) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ స్కూళ్లలో విద్యార్థులకు ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ (Breakfast), లంచ్ అందించడంతో పాటు ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ (Transport facility) కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ముందుగా కోర్ అర్బన్ (Core Urban) ప్రాంతాల్లో వీలైనన్ని స్కూళ్లను ప్రారంభించబోతున్నట్లు కమిషన్‌కు వివరించారు.

CM Revanth Reddy Explains Telangana's Education Reforms to SC Commission

ఎస్సీ వర్గీకరణ పక్కాగా అమలు

రాష్ట్రంలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణ (SC Categorization) పూర్తి చేసి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయాలతో సహా అనేక కీలక రంగాల్లో దళితులకు వారి జనాభా శాతానికి మించి అవకాశాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (Scheduled Castes) సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక సాయం, సహకారం అందేలా చొరవ తీసుకోవాలని ఎస్సీ కమిషన్‌ను ముఖ్యమంత్రి కోరారు.

CM Revanth Reddy Explains Telangana's Education Reforms to SC Commission

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, సీఎస్ (CS) సంజయ్ జాజు, డీజీపీ (DGP) సీవీ ఆనంద్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement