PM Modi | మధ్యప్రాచ్యంలో యుద్ధం భారత్కు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది : ప్రధాని మోదీ
PM Modi | మధ్యప్రాచ్యంలో (West Asia) యుద్ధం భారత్కు అనేక సవాళ్లను తెచ్చిపెట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి లోక్సభలో ప్రధాని ప్రసంగించారు.
PM Modi | మధ్యప్రాచ్యంలో (West Asia) యుద్ధం భారత్కు అనేక సవాళ్లను తెచ్చిపెట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి లోక్సభలో ప్రధాని ప్రసంగించారు. అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపారు. యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు వారాలు పూర్తైందన్నారు. ఈ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
వాణిజ్యం దెబ్బతింటోంది..
ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసులో ఆటంకాలు కలగడంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో అనేక సమస్యలు వస్తున్నట్లు చెప్పారు. ఈ వార్ మనకూ అనేక సవాళ్లను తెచ్చిపెట్టిందన్నారు. ఈ యుద్ధం వల్ల ఇతర దేశాలతో వాణిజ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఇంధనం అత్యంత కీలకమని ప్రధాని అన్నారు. దేశ చమురు, గ్యాస్ అవసరాలను తీర్చడంలో పశ్చిమాసియా ప్రధాన వనరుగా ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఆయా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాం..
ఇక ఈ యుద్ధం వల్ల కలిగే ప్రభావాలను తగ్గించేందుకు, ఇంధన సవాళ్లను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వం అన్ని రంగాల్లోని భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. హర్మూజ్ నుంచి మరిన్ని నౌకలు భారత్కు వస్తున్నాయని తెలిపారు. "ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై పెద్దగా ప్రభావం పడకుండా చూడటానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సామాన్య గృహాలకు ఇబ్బందులు కలగకుండా చూడటమే మా ప్రధాన లక్ష్యం. భారతదేశం తన ఎల్పీజీ (LPG) అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అందుకే దిగుమతులపై భారం తగ్గించడానికి దేశంలోనే ఇంధన ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాం" అని ప్రధాని పేర్కొన్నారు. అదే సమయంలో హర్మూజ్ ముట్టడి, నౌకలపై దాడులు ఆమోదయోగ్యం కాదని ప్రధాని వ్యాఖ్యానించారు.
3 లక్షల మంది భారతీయుల్ని తీసుకొచ్చాం..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత పౌరుల భద్రతకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ విద్యార్థులు సహా 3 లక్షల మందికిపైగా భారతీయుల్ని స్వదేశానికి తరలించినట్లు చెప్పారు. ఇరాన్ నుంచి వెయ్యి మంది భారతీయుల్ని సురక్షితంగా తీసుకొచ్చినట్లు చెప్పారు. గల్ఫ్ దేశాలతో భారత్కు లోతైన వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు. అక్కడ చిక్కుకుపోయిన మన పౌరులకు అక్కడి దౌత్య కార్యాలయాలు సహాయం చేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. అంతేకాదు, పలు గల్ఫ్ దేశాల నాయకులతో మాట్లాడినట్లు చెప్పారు. తమ భూభాగాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత, క్షేమంపై వారు హామీ ఇచ్చారని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read..
మార్కెటింగ్ శక్తిని చాటిన ఐపీఎల్.. రూ.1వేయి కోట్లు దాటిన జట్ల స్పాన్సర్షిప్ ఆదాయం..
ట్రంప్ కఠిన వీసా నిబంధనలు.. భారత్, చైనీయులపైనే అధిక ప్రభావం..!
అకస్మాత్తు వర్షాలు, వాతావరణ మార్పులతో ప్రజల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు.. హెచ్చరించిన WHO..
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






