త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మ‌నువ‌డి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు

CM Revanth Reddy | సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. నిత్యం ప్ర‌జా పాల‌న‌లో త‌ల‌మున‌క‌ల‌వుతూ బిజీగా గ‌డుపుతున్న ఎనుముల రేవంత్ రెడ్డి.. తీరిక స‌మ‌యం దొరికించుకున్నారు. విరామం, విశ్రాంతి లేకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌మీక్షించే సీఎం.. బిజీ లైఫ్‌ను కాస్తా ప‌క్క‌న పెట్టి కిచెన్‌లోకి ప్ర‌వేశించారు.

S

Telangana | Published On Jul 9, 2026, 5.37 pm IST

CM Revanth Reddy | కిచెన్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. మ‌నువ‌డి కోసం గుండ్రంగా లేని డజన్ పూరీలు
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. నిత్యం ప్ర‌జా పాల‌న‌లో త‌ల‌మున‌క‌ల‌వుతూ బిజీగా గ‌డుపుతున్న ఎనుముల రేవంత్ రెడ్డి.. తీరిక స‌మ‌యం దొరికించుకున్నారు. విరామం, విశ్రాంతి లేకుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌మీక్షించే సీఎం.. బిజీ లైఫ్‌ను కాస్తా ప‌క్క‌న పెట్టి కిచెన్‌లోకి ప్ర‌వేశించారు.

త‌న మ‌నువ‌డి కోరిక మేర‌కు.. రేవంత్ స్వ‌యనా పూరీలు చేసి పెట్టారు. ఈ పూరీ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను సీఎం రేవంత్ స్వ‌యంగా త‌న ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు.

ఇక ఈ వీడియోకు సీఎం రేవంత్ ఇలా రాసుకొచ్చారు. "తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు అంటూ సీఎం చ‌మ‌త్క‌రించారు. బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయ‌ని సీఎం అభివ‌ర్ణించారు.

Advertisement
Advertisement