త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమ‌ల‌ వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

E Visa Facility | క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల (Tirumala) శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామివారి ద‌ర్శ‌నం కోసం వచ్చే విదేశీ భ‌క్తుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికోసం తిరుప‌తి విమానాశ్ర‌యంలోనే (Tirupati Airport) ఈ-వీసా (E Visa Facility) సేవ‌ల‌ను త్వ‌ర‌లో అందుబాటులోకి తీసుకురానుంది.

G

National | Published On Aug 12, 2026, 12.23 pm IST

E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమ‌ల‌ వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్
Advertisement

E Visa Facility | త్రినేత్ర‌.న్యూస్‌: క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల (Tirumala) శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామివారి ద‌ర్శ‌నం కోసం వచ్చే విదేశీ భ‌క్తుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికోసం తిరుప‌తి విమానాశ్ర‌యంలోనే (Tirupati Airport) ఈ-వీసా (E Visa Facility) సేవ‌ల‌ను త్వ‌ర‌లో అందుబాటులోకి తీసుకురానుంది. ప్ర‌స్తుతం విదేశీ భక్తులు చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ చేరుకొని.. అక్కడ ఈ-వీసా ప్రక్రియ పూర్తిచేసుకున్న త‌ర్వాతే తిరుపతి చేరుకుంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో విదేశీ ప్ర‌యాణికుల (Foreign Devotees) తిరుమ‌ల ప్ర‌యాణం మ‌రింత సుల‌భ‌త‌రం కానుంది. ఇకపై ప్రయాణికులు విదేశాల నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయం చేరుకొని ఈ - వీసా ప్రక్రియ ముగించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి కనీసం పది రోజులు ముందే ఆన్‌లైన్‌లో ప్ర‌యాణికులు ఈ- వీసా అందుకోవాలి.

కాగా, తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు లేనప్పటికీ కేంద్ర పౌర విమానయాన శాఖ ముందస్తుగానే ఈ - వీసా కౌంటరు మంజూరు చేసింది. ఈ నేప‌థ్యంలో త్వరలోనే అంత‌ర్జాతీయ‌ సర్వీస్ లు ప్రారంభించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. 2007లోనే తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న‌ది. దీనికి సంబంధించి 2017లో నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement
Advertisement