త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Khera | సీఎం భార్య‌పై ఆరోప‌ణ‌లు.. కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట‌

Pawan Khera | కాంగ్రెస్ (Congress) సీనియ‌ర్‌ నేత ప‌వ‌న్ ఖేరా (Pawan Khera)కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఊర‌ట ల‌భించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) భార్యపై చేసిన ఆరోప‌ణ‌ల‌పై న‌మోదైన కేసులో ఖేరాకు అరెస్టు నుంచి వారం రోజుల పాటూ కోర్టు ఊర‌ట క‌ల్పించింది.

D

National | Published On Apr 10, 2026, 12.33 pm IST

Pawan Khera | సీఎం భార్య‌పై ఆరోప‌ణ‌లు.. కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊర‌ట‌
Advertisement

Pawan Khera | కాంగ్రెస్ (Congress) సీనియ‌ర్‌ నేత ప‌వ‌న్ ఖేరా (Pawan Khera)కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఊర‌ట ల‌భించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) భార్యపై చేసిన ఆరోప‌ణ‌ల‌పై న‌మోదైన కేసులో ఖేరాకు అరెస్టు నుంచి వారం రోజుల పాటూ కోర్టు ఊర‌ట క‌ల్పించింది. అంత‌లోపు ముంద‌స్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసుకోవాల‌ని జ‌స్టిస్ కె.సుజ‌న‌తో కూడిన బెంచ్ సూచించింది. అయితే, ఖేరా త‌ర‌ఫున న్యాయ‌వాది మ‌రింత స‌మ‌యం కావాల‌ని కోర‌గా.. అందుకు కోర్టు నిరాక‌రించింది.

కాగా, అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ భార్య రిణికి భూయాన్ శ‌ర్మ (Riniki Bhuyan Sarma)పై ప‌వ‌న్ ఖేరా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. రిణికి శర్మకు మూడు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, ఆ సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై సీఎం భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖేరాపై గువాహటిలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో గువాహ‌టి పోలీసులు న‌మోదు చేసిన కేసులో ముంద‌స్తు బెయిల్ కోరుతూ వ‌ప‌న్ ఖేరా తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచార‌ణ జ‌రిగింది. విచార‌ణ సంద‌ర్భంగా రాజకీయ దురుద్దేశంతోనే అస్సాం పోలీసులు పవన్‌ ఖేరాపై సంబంధం లేని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఖేరా తరఫున న్యాయవాదులు ధర్మాసనానికి తెలియ‌జేశారు. ఖేరా పట్ల హిమంత‌ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఇక అస్సాం రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దేవజిత్‌ సైకియా వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ ఖేరా ఢిల్లీలో శాశ్వత నివాసి అని, ఆయనపై అస్సాంలో కేసు న‌మోదైతే తెలంగాణ హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ ఎలా దాఖ‌లు చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇరుప‌క్షాల‌ వాదనలు విన్న ధర్మాసనం ఖేరా దాఖ‌లు చేసిన‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణార్హతపై తీర్పు రిజర్వు చేసింది. ఇవాళ ముంద‌స్తు బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది.

Also Read..

తొడ‌ల వ‌ద్ద కొవ్వు అధికంగా ఉందా.. ఈ యోగాస‌నాలు వేయండి..

శాంతి చ‌ర్చ‌ల‌పై ప్ర‌తిష్టంభ‌న‌.. అప్పటి వ‌ర‌కూ అమెరికాతో చ‌ర్చ‌లు ఉండవంటూ ఇరాన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంపు.. జనవరి నుంచే వర్తింపు

Advertisement
Advertisement