DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. డీఏ పెంపు.. జనవరి నుంచే వర్తింపు
DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు (TGSRTC Employees) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏను 2.1 శాతం మేర (DA Hike) పెంచింది. పెరిగిన అలవెన్స్ ఈ ఏడాది జనవరి 1 నుంచే వర్తించనున్నట్లు తెలిపింది.
DA Hike | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ ఉద్యోగులకు (TGSRTC Employees) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డీఏను 2.1 శాతం మేర (DA Hike) పెంచింది. పెరిగిన అలవెన్స్ ఈ ఏడాది జనవరి 1 నుంచే వర్తించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రకటించారు. ఇప్పటివరకు 50.7 శాతంగా ఉన్న డీఏ.. తాజా పెంపుతో 52.8 శాతానికి పెరిగింది. దీంతో ఆర్టీసీపై ప్రతి నెల రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది. గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్లుల ద్వారా డీఏను ప్రభుత్వం చెల్లించనుంది. గతేడాది జూలైలో కూడా డీఏను 2.1 శాతం పెంచిన విషయం తెలిసిందే. డీఏ పెంపు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్ పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
`ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏను ప్రభుత్వం విడుదల చేసింది. 2026 జనవరి నుంచి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వచ్చింది. దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరింది. జనవరి నుంచి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలను వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేస్తాం. తెలంగాణ ప్రజా పాలనలో ప్రభుత్వం మొదటి నుంచి ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తున్నది.
సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమంపై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణకు దవాఖాన అప్గ్రేడేషన్, కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రీమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం, కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నది. డీఏ పెంపు ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి ఉపయోగపడుతుంది. తెలంగాణలో లైఫ్ లైన్గా ఉన్న ఆర్టీసీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లలా కృషి చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది` అని మంత్రి పొన్నం అన్నారు.
ఆర్టీసీ సిబ్బంది ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న డీఏను ఈరోజు ప్రకటించడం పట్ల సంస్థ ఎండీ నాగిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






