త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

commercial shipping | వాణిజ్య నౌక‌ల‌పై దాడుల‌ను త‌క్ష‌ణ‌మే ఆపండి.. ఇరాన్ రాయ‌బారికి భార‌త్ స‌మ‌న్లు

commercial shipping | హ‌ర్మూజ్ జ‌ల‌సంధిలో వాణిజ్య నౌక‌ల‌పై (commercial shipping) దాడుల‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది. వీటిని నావికుల‌పై జ‌రిగిన హింసాత్మ‌క చ‌ర్య‌లుగా అభివ‌ర్ణించింది.

D

National | Published On Jul 14, 2026, 3.27 pm IST

commercial shipping | వాణిజ్య నౌక‌ల‌పై దాడుల‌ను త‌క్ష‌ణ‌మే ఆపండి.. ఇరాన్ రాయ‌బారికి భార‌త్ స‌మ‌న్లు
Advertisement

commercial shipping | త్రినేత్ర‌.న్యూస్ : హ‌ర్మూజ్ జ‌ల‌సంధిలో యూఏఈ (UAE) కి చెందిన చమురు ట్యాంకర్ల (Oil tankers) పై ఇరాన్ జ‌రిపిన‌ దాడిలో ఓ భార‌తీయ నావికుడు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) తీవ్రంగా స్పందించింది. న్యూఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయ (Iran Embassy) డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ మహ్మద్‌ జావెద్‌ హుస్సేనీ (Mohamd Javed Husseni)ని విదేశాంగ శాఖ పిలిపించి తీవ్ర‌ నిరసన తెలియ‌జేసింది. ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ స‌మ‌న్లు జారీచేసింది.

హ‌ర్మూజ్ జ‌ల‌సంధిలో వాణిజ్య నౌక‌ల‌పై (commercial shipping) దాడుల‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది. వీటిని నావికుల‌పై జ‌రిగిన హింసాత్మ‌క చ‌ర్య‌లుగా అభివ‌ర్ణించింది. జ‌ల‌సంధిలో వ‌రుస దాడులు నౌక‌ల సుర‌క్షిత ప్ర‌యాణానికి ముప్పుగా మారాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు అనుగుణంగా హ‌ర్మూజ్‌లో స్వేచ్ఛాయుత‌, అంత‌రాయం లేని నౌకాయానం, వాణిజ్యాన్ని వీలైనంత త్వ‌ర‌గా పున‌రుద్ధ‌రించాల‌ని కోరింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌక‌లు, పౌర మౌలిక స‌దుపాయాల‌పై దాడులు ఆగిపోవాల‌ని భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. యుద్ధం ముగింపుకు అమెరికాతో చ‌ర్చ‌లు కొన‌సాగించాల‌ని టెహ్రాన్‌కు సూచించింది.

భార‌త నావికుడి మృతి

హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz)లో ర‌వాణా నౌక‌లే ల‌క్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. ఒమ‌న్ తీరం స‌మీపంలో రెండు యూఏఈ ట్యాంక‌ర్ల‌ (UAE Tankers)పై ఐఆర్‌జీసీ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది (Indian sailor) మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయ‌ప‌డిన వారిలో ఆరుగురు భార‌తీయులు కాగా, ఇద్ద‌రు ఉక్రెయిన్​ పౌరులు ఉన్నట్లు యూఏఈ రక్షణశాఖ ప్రకటించింది.

మొంబాసా, అల్‌ బహియా అనే రెండు జాతీయ చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ క్రూయిజ్‌ క్షిపణులతో దాడి చేసినట్లు యూఏఈ ర‌క్ష‌ణ‌శాఖ‌ తెలిపింది. ఈ దాడి కారణంగా రెండు ట్యాంకర్లలోనూ భారీగా మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు రంగంలోకి దిగి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ఈ ఘ‌ట‌న‌లో నౌకలకు తీవ్ర‌మైన న‌ష్టం వాటిల్లిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ తెలిపింది. ఈ దాడి ఘ‌ట‌న‌ను యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Advertisement
Advertisement