త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strait of Hormuz | హ‌ర్మూజ్‌లో ట్యాంక‌ర్ల‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి

Strait of Hormuz | హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz)లో ర‌వాణా నౌక‌లే ల‌క్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. ఒమ‌న్ తీరం స‌మీపంలో రెండు యూఏఈ ట్యాంక‌ర్ల‌ (UAE Tankers)పై ఐఆర్‌జీసీ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది (Indian sailor) మృతి చెంద‌గా.. ఆరుగురు గాయ‌ప‌డ్డారు.

D

International | Published On Jul 14, 2026, 9.20 am IST

Strait of Hormuz | హ‌ర్మూజ్‌లో ట్యాంక‌ర్ల‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి
Advertisement

Strait of Hormuz | త్రినేత్ర‌.న్యూస్ : అమెరికా-ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు తీవ్ర‌రూపం దాల్చాయి. ఒక‌రిపై ఒక‌రు భీక‌ర దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz)లో ర‌వాణా నౌక‌లే ల‌క్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. ఒమ‌న్ తీరం స‌మీపంలో రెండు యూఏఈ ట్యాంక‌ర్ల‌ (UAE Tankers)పై ఐఆర్‌జీసీ క్షిపణులతో దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది (Indian sailor) మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయ‌ప‌డిన వారిలో ఆరుగురు భార‌తీయులు కాగా, ఇద్ద‌రు ఉక్రెయిన్​ పౌరులు ఉన్నట్లు యూఏఈ రక్షణశాఖ ప్రకటించింది.

మొంబాసా, అల్‌ బహియా అనే రెండు జాతీయ చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ క్రూయిజ్‌ క్షిపణులతో దాడి చేసినట్లు యూఏఈ ర‌క్ష‌ణ‌శాఖ‌ తెలిపింది. ఈ దాడి కారణంగా రెండు ట్యాంకర్లలోనూ భారీగా మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు రంగంలోకి దిగి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ఈ ఘ‌ట‌న‌లో నౌకలకు తీవ్ర‌మైన న‌ష్టం వాటిల్లిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ తెలిపింది. ఈ దాడి ఘ‌ట‌న‌ను యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Advertisement
Advertisement