త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagannath Rath Yatra | పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌లో అప‌శ్రుతి.. తొక్కిస‌లాట జ‌రిగి ఒక‌రు మృతి, 200 మందికి గాయాలు

Jagannath Rath Yatra | ప‌విత్ర పూరీ (Puri) జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర (Jagannath Rath Yatra)లో అప‌శ్రుతి చోటు చేసుకుంది. భ‌క్తులు భారీగా త‌ర‌లిరావ‌డంతో అక్క‌డ తొక్కిస‌లాట (Stampede) చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఊపిరాడ‌క‌ ఒక‌రు మృతి చెంద‌గా.. సుమారు 200 మందికిపైగా గాయ‌ప‌డ్డారు.

D

National | Published On Jul 16, 2026, 5.32 pm IST

Jagannath Rath Yatra | పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌లో అప‌శ్రుతి.. తొక్కిస‌లాట జ‌రిగి ఒక‌రు మృతి, 200 మందికి గాయాలు
Advertisement

Jagannath Rath Yatra | ప‌విత్ర పూరీ (Puri) జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర (Jagannath Rath Yatra)లో అప‌శ్రుతి చోటు చేసుకుంది. భ‌క్తులు భారీగా త‌ర‌లిరావ‌డంతో అక్క‌డ తొక్కిస‌లాట (Stampede) చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఊపిరాడ‌క‌ ఒక‌రు మృతి చెంద‌గా.. సుమారు 200 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు క‌ట‌క్‌కు చెందిన వ్య‌క్తిగా అధికారులు గుర్తించారు. కాగా, గ‌తేడాది కూడా ర‌థ‌యాత్ర‌లో తొక్కిస‌లాట జ‌రిగి క‌నీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గుడించా ఆల‌యం వ‌ద్ద జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 50 మంది భ‌క్తులు గాయ‌ప‌డ్డారు.

ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) గురువారం ఘ‌నంగా ప్రారంభమైంది. ర‌థ‌యాత్ర‌ను క‌నులారా వీక్షించేందుకు దేశం న‌లుమూల‌ల నుంచి ల‌క్ష‌లాది మంది భక్తులు త‌ర‌లి వ‌చ్చారు. దీంతో పూరీ (Puri) క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో భక్తులు ‘జై జగన్నాథ్‌’, ‘హరిబోల్‌’ నినాదాలతో రథం వెంట నడుస్తూ ముందుకు సాగారు.

Also Read..

ఆక్సిజన్ ఓఎస్‌కు గుడ్‌బై.. వన్‌ప్లస్ ఫోన్లలో ఇక కలర్‌ఓఎస్, ఇండియా నుంచి ఎగ్జిట్ పై కూడా క్లారిటీ..

శ్రీలీలను రిజెక్ట్ చేస్తున్న‌ హీరోలు - ధ‌మాకా బ్యూటీని వెంటాడుతోన్న బ్యాడ్‌ లక్

వైద్యుల నిర్ల‌క్ష్యం.. అప్పుడే పుట్టిన ప‌సికందుకు తీవ్ర గాయం

Advertisement
Advertisement