త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhadradri Kothagudem | నిల్చుండ‌గానే గ‌ర్భిణి ప్ర‌స‌వం.. నేల‌పై జారిప‌డిన శిశువుకు తీవ్ర గాయం

Bhadradri Kothagudem | భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఆస్ప‌త్రిలో దారుణం జ‌రిగింది. వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా.. అప్పుడే పుట్టిన ప‌సికందుకు తీవ్ర గాయ‌మైంది. ప్ర‌స్తుతం ఆ ప‌సిబిడ్డ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

S

Telangana | Published On Jul 16, 2026, 5.09 pm IST

Bhadradri Kothagudem | నిల్చుండ‌గానే గ‌ర్భిణి ప్ర‌స‌వం.. నేల‌పై జారిప‌డిన శిశువుకు తీవ్ర గాయం
Advertisement

Bhadradri Kothagudem | త్రినేత్ర‌.న్యూస్ : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఆస్ప‌త్రిలో దారుణం జ‌రిగింది. వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా.. అప్పుడే పుట్టిన ప‌సికందుకు తీవ్ర గాయ‌మైంది. ప్ర‌స్తుతం ఆ ప‌సిబిడ్డ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

వివ‌రాల్లోకి వెళ్తే.. కొత్త‌గూడెం జిల్లాకు చెందిన ఓ గ‌ర్భిణికి నెల‌లు నిండాయి. దీంతో ఆమెకు పురిటినొప్పులు రావ‌డంతో.. జిల్లా ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు. పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణి ప‌ట్ల వైద్యులు నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించారు. లేబ‌ర్ రూమ్‌కు తీసుకెళ్ల‌కుండా అల‌స‌త్వం వ‌హించారు.

దీంతో బాధిత గ‌ర్భిణి నిల్చుండ‌గానే.. ప్ర‌స‌వ‌మైంది. ఈ క్ర‌మంలో నేల‌పై జారిప‌డ్డ ఆ ప‌సిబిడ్డ‌కు తీవ్ర గాయ‌మైంది. అప్ప‌టికీ కూడా వైద్యులు, ఇత‌ర సిబ్బంది ఆమె వ‌ద్ద‌కు చేరుకోలేదు. 10 నిమిషాల త‌ర్వాత డాక్ట‌ర్లు వ‌చ్చిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

Advertisement
Advertisement