త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Building Collapse | కుప్ప‌కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం.. ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం

Building Collapse | మహారాష్ట్రలోని భీవండీలో నాలుగు అంతస్తుల భవనం (Building Collapse) కుప్పకూలింది. దీంతో ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం చెందారు. మరో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని ర‌క్షించేందుకు పోలీసులు, ఎన్‌డీఆర్ఎఫ్, అగ్నిమాప‌క సిబ్బంది ప్ర‌య‌త్నిస్తున్నారు.

G

National | Published On Jul 31, 2026, 10.30 am IST

Building Collapse | కుప్ప‌కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం.. ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం
Advertisement

Building Collapse | త్రినేత్ర‌.న్యూస్‌: మహారాష్ట్రలోని భీవండీలో నాలుగు అంతస్తుల భవనం (Building Collapse) కుప్పకూలింది. దీంతో ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం చెందారు. మరో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని ర‌క్షించేందుకు పోలీసులు, ఎన్‌డీఆర్ఎఫ్, అగ్నిమాప‌క సిబ్బంది ప్ర‌య‌త్నిస్తున్నారు.

భీవండిలోని (Bhiwandi) బాలాజీ న‌గ‌ర్‌లో ఉన్న కోహినూర్ బిల్డింగ్ (Kohinoor Building) గురువారం రాత్రి సుమారు 11.30 గంట‌ల స‌మ‌యంలో ఒక్క‌సారిగా కుప్ప‌కూలింది. అంత‌కుముందే రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలోనే భ‌వ‌నంలో పగుళ్లను గుర్తించిన స్థానికులు.. నివాసితులను అప్రమత్తం చేశారు. పలు కుటుంబాలను కిందకు తీసుకొచ్చారు. మరికొందరు నివాసితులు బయటకు వస్తున్న సమయంలో భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో మృతుల సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని అధికారులు తెలిపారు.

కాగా, గతంలోనే ఈ భవనాన్ని స్థానిక మున్సిపల్ అధికారులు రెడ్‌ లిస్ట్‌లో చేర్చారని తెలిపారు. ఈనేప‌థ్యంలో భవనంలో మరమ్మతు పనులు చేపడుతుండగా ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని చెప్పారు. నాలుగు అంత‌స్తుల భ‌వ‌నంలో ప్ర‌తి ఫ్లోర్‌లో 12 చొప్పున మొత్తం 48 గ‌దులు ఉన్నాయి.

Advertisement
Advertisement