త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Land Dispute | దారుణం.. వృద్ధురాలిని బ‌లితీసుకున్న‌ భూ వివాదం

Land Dispute | మహారాష్ట్ర (Maharashtra)లో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. భూ వివాదం (Land Dispute) ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది.

D

National | Published On Sep 12, 2026, 1.41 pm IST

Land Dispute | దారుణం.. వృద్ధురాలిని బ‌లితీసుకున్న‌ భూ వివాదం
Advertisement

Land Dispute | త్రినేత్ర‌.న్యూస్ : మహారాష్ట్ర (Maharashtra)లో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. భూ వివాదం (Land Dispute) ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. ఆమె ఇంటిని ప్ర‌త్య‌ర్థులు బొలెరో పిక‌ప్ వాహ‌నంతో (Bolero Pickup) ధ్వంసం చేశారు. అకోలా (Akola) జిల్లా బర్షితక్లి తాలూకాలోని జమ్వాసు గ్రామంలో (Jamvasu village) ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతురాలిని సోనాబాయి మ‌ఖ‌రామ్ జాధ‌వ్ (75)గా గుర్తించారు.

కొంద‌రు వ్య‌క్తులు బొలెరో పిక‌ప్ వాహ‌నంతో వృద్ధురాలి ఇంటిని ప‌లు మార్లు ఢీ కొట్టారు. ఆ స‌మ‌యంలో ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌తో ఆమె స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా భ‌యాందోళ‌న ప‌రిస్థితులు నెలకొన్నాయి. దాడికి దారితీసిన ఖ‌చ్చిత‌మైన ప‌రిస్థితులు తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read..

ప్ర‌జ్వ‌ల్ ఫోన్‌లో డ‌జ‌న్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేష‌ణ‌లో వెలుగులోకి షాకింగ్ విష‌యాలు

శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. డిసెంబర్ నెల దర్శన, వసతి కోటా విడుదల ఎప్పుడంటే?

లోన్‌ను ముందే చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా.. అస‌లు నిజం ఇదే..

Advertisement
Advertisement