త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karur Stampede Case | సీఎం విజ‌య్‌కి భారీ ఊర‌ట‌.. డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

Karur Stampede Case | క‌రూర్ తొక్కిస‌లాట కేసు (Karur Stampede Case)లో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్‌ (CM Vijay)కి భారీ ఊర‌ట ద‌క్కింది.

D

National | Published On Jul 7, 2026, 2.51 pm IST

Karur Stampede Case | సీఎం విజ‌య్‌కి భారీ ఊర‌ట‌.. డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం
Advertisement

Karur Stampede Case | క‌రూర్ తొక్కిస‌లాట కేసు (Karur Stampede Case)లో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్‌ (CM Vijay)కి భారీ ఊర‌ట ద‌క్కింది. సీబీఐ ద‌ర్యాప్తు పూర్త‌య్యే వ‌ర‌కూ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై టీవీకే మంత్రులు, ముఖ్యమంత్రి విజయ్‌ (CM Vijay) పర్యటనలు, ప్రసంగాలపై ఆంక్షలు విధించాలని కోరుతూ డీఎంకే ( DMK) దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) విచారించింది. విచార‌ణ సంద‌ర్భంగా డీఎంకేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోర్టును రాజ‌కీయ వేదిక‌గా మార్చ‌కండి అంటూ వ్యాఖ్యానించింది.

ఈ వ్య‌వ‌హారంపై వెకేష‌న్ బెంచ్ ఇప్ప‌టికే సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించిన‌ప్పుడు.. ఒక రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను తాము ఎలా విచారిస్తామ‌ని కోర్టు ప్ర‌శ్నించింది. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై న‌మోదైన ఎఫ్ఐఆర్‌లో నిందితుడిగా సీఎం విజ‌య్ పేరు ఎక్క‌డా లేద‌ని తెలిపింది. ముఖ్యమంత్రి ఏం చేయాలి..? ఏం మాట్లాడాలో కూడా సుప్రీంకోర్టే చెప్పాలా..? అంటూ నిల‌దీసింది. ముఖ్య‌మంత్రి విజ‌య్ ఈ కేసులో నిందితుడు కాద‌ని తెలిపింది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కుపైనా ఆంక్షలు కోరుతున్నారా..? అంటూ డీఎంకేకు చుర‌క‌లంటించింది. ఈ మేర‌కు పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డీఎంకేకి సూచించింది. దాంతో డీఎంకే తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది.

గ‌తేడాది సెప్టెంబ‌ర్ 27న టీవీకే నిర్వ‌హించిన భారీ ర్యాలీలో తొక్కిస‌లాట జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోగా.. మ‌రో 142 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే సుప్రీంకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టింది. అయితే, సీబీఐ విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కూ ఈ ఘ‌ట‌న‌పై టీవీకే మంత్రులు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాలంటూ డీఎంకే ఆర్గ‌నైజింగ్ కార్యద‌ర్శి ఆర్ఎస్ భార‌తి త‌ర‌ఫు న్యాయ‌వాది సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.

ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే మంత్రి ఆద‌వ్ అర్జున చేసిన వ్యాఖ్య‌లు విచార‌ణ‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని డీఎంకే పిటిష‌న్‌లో పేర్కొంది. జులై 2న జ‌రిగిన స‌భ‌లో మాట్లాడుతూ.. ఈ ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటామంటూ గ‌త డీఎంకే ప్ర‌భుత్వాన్నే క‌రూర్ విషాదానికి బాధ్య‌త‌లుగా ఆరోపించారంటూ డీఎంకే నేత పిటిష‌న్‌లో ప్ర‌స్తావించారు. ద‌ర్యాప్తును ఎదుర్కొంటున్న వ్య‌క్తి, అదీ రాష్ట్ర మంత్రిగా కొన‌సాగుతూ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌ని, సీబీఐ విచార‌ణ‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని డీఎంకే వాదిస్తోంది. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే డీఎంకే నాయ‌క‌త్వంపై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే అభిప్రాయం క‌ల్పించ‌డ‌మే మంత్రి వ్యాఖ్యల ఉద్దేశ‌మ‌ని ఆరోపించింది.

Advertisement
Advertisement