Harsh Goenka | మీ జీవితాన్ని మార్చే 3-30-300 రూల్.. హర్ష్ గోయెంకా చెప్పిన సక్సెస్ సీక్రెట్..
Harsh Goenka | మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నామో అది మన జీవితంపై ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా పేర్కొన్నారు. మన ఆలోచనా విధానం నుంచి కెరీర్ అవకాశాల వరకు, మన చుట్టూ ఉండే వ్యక్తులే వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు కీలకంగా మారతారని ఆయన తెలిపారు.
Harsh Goenka | మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నామో అది మన జీవితంపై ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా పేర్కొన్నారు. మన ఆలోచనా విధానం నుంచి కెరీర్ అవకాశాల వరకు, మన చుట్టూ ఉండే వ్యక్తులే వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు కీలకంగా మారతారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఇటీవల ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు. జీవితంలోని 3-30-300 రూల్, ముగ్గురు వ్యక్తులు మీరు ఎలాంటి వ్యక్తిగా మారుతారో నిర్ణయిస్తుందని తెలిపారు. 30 మంది మీ ఆలోచనా పరిధిని విస్తరిస్తారు. 300 మంది మీ నెట్వర్క్ను పెంచుతారు. కాబట్టి మీ సర్కిల్ను ఎంతో జాగ్రత్తగా ఎంచుకోండని ఆయన పేర్కొన్నారు. కాగా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారి విస్తృత చర్చకు దారితీసింది. మెంటర్షిప్, స్నేహాలు, నెట్వర్కింగ్, వ్యక్తిగత అభివృద్ధి వంటి అంశాలపై అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
3-30-300 రూల్ అంటే ఏమిటి?
హర్ష్ గోయెంకా వివరించిన ఈ కాన్సెప్ట్ ప్రకారం, మన జీవితంలో వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పాత్రలు పోషిస్తారు. మొదటి ముగ్గురు వ్యక్తులు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతారు. వారి విలువలు, అలవాట్లు, సలహాలు మన నిర్ణయాలు, ప్రవర్తన, భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. వీరిలో మెంటర్లు, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత స్నేహితులు లేదా మనం ఆదర్శంగా భావించే వ్యక్తులు ఉంటారు. తర్వాతి 30 మంది మన ఆలోచనా విధానాన్ని విస్తరిస్తారు. సహోద్యోగులు, సహచరులు, పరిశ్రమ నిపుణులు, పరిచయస్తులు వంటి వారు కొత్త ఆలోచనలు, కొత్త దృక్కోణాలు, కొత్త అనుభవాలను పరిచయం చేస్తారు. దీంతో మనలో కొత్త నైపుణ్యాలు పెంపొందడంతోపాటు విభిన్న కోణాల్లో ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. చివరి 300 మంది మన నెట్వర్క్ను విస్తరిస్తారు. వీరి ద్వారా కొత్త అవకాశాలు, వ్యాపార సంబంధాలు, ఉద్యోగ అవకాశాలు, భాగస్వామ్యాలు, కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నెట్వర్కింగ్ అంటే కేవలం ఎక్కువ మందితో పరిచయాలు పెంచుకోవడం కాదు. పరస్పరం విలువను సృష్టించే నిజమైన సంబంధాలను నిర్మించుకోవడమే అసలు విషయమని ఈ సందేశం ఉద్దేశం.
మొదటి ముగ్గురు వ్యక్తులు కీలకం..
మన జీవితాన్ని ప్రభావితం చేసే మొదటి ముగ్గురు వ్యక్తులే అత్యంత ముఖ్యమైనవారని మానసిక నిపుణులు, నాయకత్వ నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. మనకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులు మన అలవాట్లు, ఆత్మవిశ్వాసం, ఆలోచనా విధానం, దీర్ఘకాల లక్ష్యాలను ప్రభావితం చేస్తారు. సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, విజయాన్ని ఎలా నిర్వచించాలి అనే అంశాల్లో కూడా వారి ప్రభావం ఉంటుంది. అందుకే విజయవంతమైన నాయకులు తమను సవాలు చేస్తూ నిజాయితీతో సలహాలు ఇచ్చే మెంటర్లు, సలహాదారులను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. మనలాగే ఆలోచించే వ్యక్తుల మధ్య మాత్రమే ఉంటే అభివృద్ధి పరిమితమవుతుంది. భిన్న నేపథ్యాలు, వృత్తులు, అనుభవాలు కలిగిన వ్యక్తులతో మమేకమైతే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. ఇప్పటికే ఉన్న అభిప్రాయాలను ప్రశ్నించుకోవచ్చు. కొత్త ఆలోచనలకు అవకాశం కలుగుతుంది. ఉద్యోగం, విద్య లేదా సామాజిక వర్గాల ద్వారా ఏర్పడే ఈ పరిచయాలు జీవితంలో ప్రేరణగా మారుతాయి.
నెటిజన్ల స్పందన..
ఈ రోజుల్లో ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు, భాగస్వామ్యాలు, కొత్త ప్రాజెక్టులు చాలా వరకు పరిచయాలు, రిఫరల్స్, వృత్తిపరమైన సంబంధాల ద్వారానే వస్తుంటాయి. బలమైన నెట్వర్క్ ఉంటే సాధారణంగా మనకు తెలియని అవకాశాలు కూడా సులభంగా అందుబాటులోకి వస్తాయి. హర్ష్ గోయెంకా చెప్పిన 3-30-300 రూల్ విజయాన్ని ఎవరూ ఒంటరిగా సాధించలేరని గుర్తు చేస్తుంది. మన చుట్టూ ఉండే వ్యక్తులే మన ఆలోచనలను ప్రభావితం చేస్తారు, జ్ఞానాన్ని విస్తరిస్తారు, కొత్త అవకాశాలకు దారి చూపుతారు. సంఖ్యలు వ్యక్తికి వ్యక్తికి మారుతాయి. కానీ ప్రధాన సందేశం మాత్రం ఒకటే. మీతో ఉండే వ్యక్తులను ఆలోచించి ఎంపిక చేసుకోండి. ఎందుకంటే మీ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీ సర్కిల్ కీలక పాత్ర పోషిస్తుంది. కాగా ఈ పోస్టుపై నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ మొదటి ముగ్గురు వ్యక్తులే మిగిలిన 330 మందిపై కూడా ప్రభావం చూపిస్తారని తమకు అర్థమైందని చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే హర్ష్ గోయెంకా పెట్టిన పోస్టుకు చాలా మంది మద్దతు తెలుపుతుండడం విశేషం.
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | కేటీఆర్.. మరి తొమ్మిదిన్నరేండ్లలో ఏం చేశారు..?
- ●Gujarat High Court | ఆ 38 మందికి ఉరిశిక్ష.. గుజరాత్ కోర్టు సంచలన తీర్పు
- ●Manipal Health IPO | మణిపాల్ హెల్త్ ఐపీఓ వచ్చేస్తోంది.. భారీ హెల్త్కేర్ ఐపీఓకు ఇన్వెస్టర్లు రెడీ..
- ●KUDA | 'కుడా'లో రూ. 70 కోట్ల అవినీతి.. టెండర్లు రద్దు చేయాల్సిందే
- ●Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు
- ●PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..

Mahesh Kumar Goud | కేటీఆర్.. మరి తొమ్మిదిన్నరేండ్లలో ఏం చేశారు..?

Gujarat High Court | ఆ 38 మందికి ఉరిశిక్ష.. గుజరాత్ కోర్టు సంచలన తీర్పు

Manipal Health IPO | మణిపాల్ హెల్త్ ఐపీఓ వచ్చేస్తోంది.. భారీ హెల్త్కేర్ ఐపీఓకు ఇన్వెస్టర్లు రెడీ..

KUDA | 'కుడా'లో రూ. 70 కోట్ల అవినీతి.. టెండర్లు రద్దు చేయాల్సిందే





