త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI ATM | ఏకంగా ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లారు.. న‌గ‌దు కాజేసీ, పెట్రోల్‌తో కాల్చేశారు..

SBI ATM | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లా బుక్క‌రాయస‌ముద్రంలో (Bukkarayasamudram) దొంగ‌లు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎమ్‌ మిషన్‌నే (SBI ATM) ఎత్తుకెళ్లి న‌గ‌దు కాజేశారు.

G

National | Published On Jun 17, 2026, 11.15 am IST

SBI ATM | ఏకంగా ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లారు.. న‌గ‌దు కాజేసీ, పెట్రోల్‌తో కాల్చేశారు..
Advertisement

SBI ATM | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లా బుక్క‌రాయస‌ముద్రంలో (Bukkarayasamudram) దొంగ‌లు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎమ్‌ మిషన్‌నే (SBI ATM) ఎత్తుకెళ్లి న‌గ‌దు కాజేశారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున బుక్కరాయసముద్రంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎమ్ మిషన్‌‌ ఉన్న గది అద్దాలను ఇనుప రాడ్ల‌తో ధ్వంసం చేసిన‌ దుండగులు అందులోకి ప్ర‌వేశించారు. అనంతరం ఏటీఎమ్ మిషన్‌‌తో పాటు బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. శింగ‌న‌మ‌ల మండ‌లం ఆకులేడు శివారులో ప‌డేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలినికి చేరుకుని పరిశీలించారు. ఏటీఎం మెషిన్‌, అందులో బ్యాట‌రీల‌ను ఎత్తుకెళ్లిన‌ట్లు గుర్తించారు. దుండ‌గుల‌ను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలిస్తున్నారు. ఎత్తుకెళ్లిన ఏటీఎమ్‌ను శింగనమల మండలం ఆకులోడు దగ్గర పడేసినట్లు తెలిపారు. న‌గ‌దును తీసుకెళ్లి, మెషిన్‌ను అక్క‌డే ప‌డేశార‌ని వెల్ల‌డించారు. అంతేకాకుండా ఏటీఎమ్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టార‌ని చెప్పారు. ఈ ఘ‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement
Advertisement