త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | కోఠిలో కాల్పుల క‌ల‌క‌లం.. రూ. 6 ల‌క్ష‌లు అప‌హ‌రించిన దుండ‌గులు

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌రంలోని కోఠిలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఏటీఎంలో డ‌బ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న వ్య‌క్తి నుంచి రూ. 6 ల‌క్ష‌లు అప‌హ‌రించి, కాల్పులు జ‌రిపి పారిపోయారు దుండ‌గులు.

S

Hyderabad | Published On Jan 31, 2026, 8.42 am IST

Hyderabad | కోఠిలో కాల్పుల క‌ల‌క‌లం.. రూ. 6 ల‌క్ష‌లు అప‌హ‌రించిన దుండ‌గులు
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని కోఠిలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఏటీఎంలో డ‌బ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న వ్య‌క్తి నుంచి రూ. 6 ల‌క్ష‌లు అప‌హ‌రించి, కాల్పులు జ‌రిపి పారిపోయారు దుండ‌గులు. ఈ ఘ‌ట‌న శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల‌కు చోటు చేసుకుంది.

కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్‌బీఐ ప్ర‌ధాన కార్యాల‌యం వ‌ద్ద ఉన్న ఏటీఎంలో డ‌బ్బులు డిపాజిట్ చేసేందుకు రిష‌ద్ అనే వ్య‌క్తి బ‌య‌ల్దేరాడు. అత‌న్ని ఫాలో అయిన దుండ‌గులు.. ఏటీఎం వ‌ద్ద‌కు రాగానే తుపాకీతో కాల్పులు జ‌రిపారు. రిష‌ద్ కాలికి బుల్లెట్ త‌గిలింది. దీంతో అత‌ను కింద ప‌డిపోయాడు. ఇక రిష‌ద్ వ‌ద్ద ఉన్న రూ. 6 ల‌క్ష‌ల‌ను దుండ‌గులు ఎత్తుకెళ్లారు.

స‌మాచారం అందుకున్న సుల్తాన్ బ‌జార్ పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. రిష‌ద్‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఘ‌ట‌నాస్థ‌లిలో క్లూస్ టీం ఆధారాల‌ను సేక‌రించింది. సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement