త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Speaker Om Birla | లోక్‌స‌భ స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం.. 10 గంట‌ల‌పాటూ కొన‌సాగ‌నున్న చ‌ర్చ‌

Speaker Om Birla | లోక్‌స‌భ (Lok Sabha) స్పీక‌ర్ ఓం బిర్లాపై (Speaker Om Birla) విప‌క్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్‌ ఎంపీ మహమ్మద్‌ జావెద్ (Congress MP Mohammed Jawed) స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. దీనిపై చ‌ర్చ ప్రారంభించారు.

D

National | Published On Mar 10, 2026, 1.40 pm IST

Speaker Om Birla | లోక్‌స‌భ స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం.. 10 గంట‌ల‌పాటూ కొన‌సాగ‌నున్న చ‌ర్చ‌
Advertisement

Speaker Om Birla | పార్ల‌మెంట్ రెండో విడ‌త బ‌డ్జెట్ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. రెండో రోజైన మంగ‌ళ‌వారం ఉభ‌య‌స‌భ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా నేడు లోక్‌స‌భ (Lok Sabha) స్పీక‌ర్ ఓం బిర్లాపై (Speaker Om Birla) విప‌క్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ తీర్మానాన్ని కాంగ్రెస్‌ ఎంపీ మహమ్మద్‌ జావెద్ (Congress MP Mohammed Jawed) స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. దీనిపై చ‌ర్చ ప్రారంభించారు. అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు 10 గంట‌ల స‌మ‌యం కేటాయించారు.

స‌భ‌లో గంద‌ర‌గోళం..

ఈ అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. సభా కార్యక్రమాలకు అధ్యక్షత వహిస్తున్నఎంపీ జ‌గ‌దాంబికా పాల్‌.. ఓం బిర్లా ఉదార‌త‌ను ప్ర‌శంసించారు. అయితే, దీనిపై విప‌క్ష స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఎంపీల ఆందోళన మ‌ధ్యే అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ కొన‌సాగుతోంది. ప‌ది గంట‌ల‌పాటూ ఈ చ‌ర్చ కొన‌సాగ‌నుంది. అనంత‌రం దీనిపై ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే సాధారణ మెజార్టీ అయిన 272 ఓట్లు కావాలి. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 293 సంఖ్యాబలం ఉంది. ప్రతిపక్షాలకు 238 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో స‌భ‌లో ఈ తీర్మానం వీగిపోయే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

బ‌డ్జెట్ తొలి విడ‌త స‌మావేశాల్లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై ప్ర‌సంగం సంద‌ర్భంగా లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా చైనా అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే (Ex Army chief General MM Naravane) త‌న పుస్త‌కంలో రాసుకున్న కొన్ని అంశాల‌ను రాహుల్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించ‌డంతో లోక్‌స‌భ‌లో గంద‌రోగ‌ళం త‌లెత్తిన విష‌యం తెలిసిందే. రాహుల్ ప్ర‌సంగాన్ని అధికార ప‌క్షం ఎంపీలు అడ్డుకోవ‌డంపై కాంగ్రెస్ ఎంపీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. స‌భ‌లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌కు దిగాయి. దీంతో ఎనిమిది మంది ఎంపీల‌ను స్పీక‌ర్ సెష‌న్ మొత్తం స‌భ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామాల‌పై ఆగ్ర‌హంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పీక‌ర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. రాజ్యాంగంలోని 94సీ ప్ర‌కారం.. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ అవిశ్వాసం నోటీసుల‌పై 118 మంది ఎంపీలు సంత‌కాలు చేశారు.

Also Read..

BCCI | టీమిండియాకు బీసీసీఐ భారీ న‌జ‌రానా.. రూ.131 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి..

రంగాల వారిగా గ్యాస్ స‌ర‌ఫ‌రా కేటాయింపుల‌ను ప్ర‌క‌టించిన కేంద్రం

8వ తరగతి బుక్‌లో వివాదాస్ప‌ద అధ్యాయంపై క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఎన్‌సీఈఆర్‌టీ

Advertisement
Advertisement