Gas Supply | రంగాల వారిగా గ్యాస్ సరఫరా కేటాయింపులను ప్రకటించిన కేంద్రం
Gas Supply | అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఇటీవల తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషించే హోర్ముజ్ జలసంధి ద్వారా జరిగే ఇంధన దిగుమతులపై భారీ ఒత్తిడి ఏర్పడింది. దీనివల్ల భారత్లో సహజ వాయు సరఫరాలో తీవ్రమైన కొరత తలెత్తింది.
Gas Supply | అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఇటీవల తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషించే హోర్ముజ్ జలసంధి ద్వారా జరిగే ఇంధన దిగుమతులపై భారీ ఒత్తిడి ఏర్పడింది. దీనివల్ల భారత్లో సహజ వాయు సరఫరాలో తీవ్రమైన కొరత తలెత్తింది. ఇప్పటికే ఈ పరిస్థితి కారణంగా పలు ప్రధాన పరిశ్రమల్లో వాస్తవికంగా సరఫరా కోతలు అమల్లోకి వచ్చినట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ సరఫరా అంతరాయాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని పరిశ్రమలకు కఠినమైన సహజ వాయు రేషన్ విధానాన్ని అధికారికంగా అమలు చేయాలని నిర్ణయించింది.
కేంద్రం అత్యవసర చర్యలు..
ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకటనలో నేచురల్ గ్యాస్ (సప్లై రెగ్యులేషన్) ఆర్డర్ ను అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. హోర్ముజ్ జలసంధి ద్వారా LNG రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ సరఫరాదారులు ఫోర్స్ మజ్యూర్ నిబంధనలను అమలు చేయడంతో ఈ అత్యవసర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ అత్యవసర చర్య ద్వారా కీలక రంగాలకు గ్యాస్ సరఫరా నిర్ధారించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత క్రమాన్ని రూపొందించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని గ్యాస్ సేల్ అగ్రిమెంట్లు (GSAలు), వాణిజ్య ఒప్పందాలపై కేంద్రం అధికారం కలిగి ఉంటుంది. ఇక ఈ నిర్ణయాల అమలుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) సహజ వాయు సరఫరాను నిర్వహిస్తుంది. అదే సమయంలో పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) గ్యాస్కు పూల్డ్ ధరను ప్రకటించనుంది.
కేటాయింపులు ఇలా..
సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నగర గ్యాస్ నెట్వర్క్లు, అత్యవసర ఇంధన ఉత్పత్తి రంగాలకు ఇప్పటికీ గత వినియోగ స్థాయిల మేర పూర్తి సరఫరా కొనసాగుతోంది. అయితే భారీ పరిశ్రమలు మాత్రం గణనీయమైన సరఫరా కోతలను భరించాల్సి వస్తోంది. తాజా ఆపరేషనల్ డేటా ప్రకారం ప్రస్తుత సరఫరా కేటాయింపులు ఇలా ఉన్నాయి.
గత 6 నెలల సగటు వినియోగాన్ని బట్టి గృహ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), ఎల్పీజీ ఉత్పత్తి, పైప్లైన్ కంప్రెసర్ ఇంధనాన్ని ప్రజలకు, ఇతర అత్యవసర రంగాలకు 100 శాతం సరఫరా చేస్తారు. టీ పరిశ్రమలు, తయారీ రంగం, ఇతర పారిశ్రామిక వినియోగదారులకు గత 6 నెలల సగటు వినియోగంలో 80 శాతం మేర సరఫరా చేస్తారు. ఎరువుల ఉత్పత్తి రంగానికి 70 శాతం, ఆయిల్ రిఫైనరీలు, పెట్రోకెమికల్ ప్లాంట్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 65 శాతం మేర మాత్రమే సరఫరా చేస్తారు. మిగిలిన భాగం మేర కోత విధిస్తారు. దీంతో ఆయా పరిశ్రమలపై భారీగా ప్రభావం పడనుంది. సహజ వాయు కొరత సమస్య దేశంలో ఎల్పీజీ సరఫరా సంక్షోభంతో ముడిపడి మరింత తీవ్రతరమవుతోంది. పాలసీ స్థాయిలో ప్రాధాన్యత క్రమాన్ని అధికారికంగా అమలు చేసే అంశం ఇంకా పరిశీలనలో ఉన్నప్పటికీ, అనేక పరిశ్రమలు ఇప్పటికే 20 శాతం నుంచి 35 శాతం వరకు సరఫరా కోతలను ఎదుర్కొంటున్నాయి.
ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం యత్నాలు..
అధిక ఇంధన వినియోగం అవసరమయ్యే రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్లోని మోర్బీ ప్రాంతంలో ఉన్న భారీ సిరామిక్స్ తయారీ పరిశ్రమల కేంద్రం ఇప్పటికే కొన్ని యూనిట్లను మూసేయడం ప్రారంభించింది. మరికొన్ని సంస్థలు ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గే సూచనలు లేకపోవడంతో ఈ పరిస్థితి పరిశ్రమలకు మరింత ఆందోళన కలిగిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






