PM Modi | పిల్లల్ని డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేయాలి.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన
PM Modi | విద్యార్థుల్లో (students)పెరుగుతున్న స్క్రీన్ టైమ్ (screen time) పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అలవాటును తగ్గించి పిల్లలను డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : విద్యార్థుల్లో (students) పెరుగుతున్న స్క్రీన్ టైమ్ (screen time) పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అలవాటును తగ్గించి పిల్లలను డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేసేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని (Teachers Day) పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులతో (national award-winning teachers) ప్రధాన మంత్రి 7, లోక్ కళ్యాణ్ మార్గ్లోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినూత్న బోధనా పద్ధతులు, స్పీచ్లు, స్క్రీన్ వ్యసనం, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు.
ప్రస్తుత సమాజంలో సాంకేతికత అవసరమే అయినప్పటికీ స్క్రీన్ టైమ్ ఓ వ్యసనంలా మారిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడలపై విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా చేస్తే స్క్రీన్ అడిక్షన్ నుంచి వారు బయటపడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులకు చదువుతోపాటూ క్రీడలు కూడా చాలా ముఖ్యమని చెప్పారు. అంతేకాకుండా నూతన సాంకేతికతలపై విద్యార్థులను ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. అలా అని పిల్లల్ని తరగతి గదులకే పరిమితం చేయకూడదని చెప్పారు. తరగతి గదుల్లో విద్యార్థులను ఆకట్టుకునేలా సరికొత్త, ఆచరణాత్మక బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు.
కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, విద్యార్థుల్లో నైతిక విలువలు, జీవన నైపుణ్యాలను పెంపొందించడంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతను పాడుచేస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని కోరారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి అలవాట్లను నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోకూడదని చెప్పారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. కేవలం సిలబస్ బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తూ వారిలో బాల్యం చనిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అదే సమయంలో ఉపాధ్యాయులు సైతం తరగతి గదుల్లో అమలు చేస్తున్న వినూత్న విద్యాబోధనా పద్ధతులను ప్రధానితో పంచుకున్నారు.
సంబంధిత వార్తలు

Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
సెప్టెంబర్ 5, 2026

Giorgia Meloni | మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు.. ఫ్రెండ్కి మోదీ కంగ్రాట్స్
సెప్టెంబర్ 4, 2026

GSLV F17 mission | మరో ఆరు ప్రయోగాలే లక్ష్యం.. GSLV-F17 ప్రయోగం విజయవంతం వేళ గగన్యాన్ అప్డేట్ ఇచ్చిన ఇస్రో ఛైర్మన్
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●POCO X8 | 9000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. పవర్ఫుల్ ఫీచర్లు..
- ●Ponnam Prabhakar | కేసీఆర్ రాజీనామాకు ఒత్తిడి తెద్దాం.. ఇందిరా పార్క్ మహాధర్నాకు తరలి రండి
- ●Viral Metro Challenge | ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న 'ఫోన్ స్టికింగ్' మెట్రో ఛాలెంజ్.. ఈ వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
- ●Revanth Reddy | రెండేండ్లు సమయమివ్వండి.. టీచర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
- ●Rashmika Mandanna | ఎపిక్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో మెరిసిన రష్మిక - మరిది సినిమా ఈవెంట్కు గెస్ట్గా వదిన
- ●Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు

POCO X8 | 9000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. పవర్ఫుల్ ఫీచర్లు..

Ponnam Prabhakar | కేసీఆర్ రాజీనామాకు ఒత్తిడి తెద్దాం.. ఇందిరా పార్క్ మహాధర్నాకు తరలి రండి

Viral Metro Challenge | ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న 'ఫోన్ స్టికింగ్' మెట్రో ఛాలెంజ్.. ఈ వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

Revanth Reddy | రెండేండ్లు సమయమివ్వండి.. టీచర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి



