India GDP | 7.8 శాతం అద్భుతం.. భారత ఆర్థిక వృద్ధికి మోదీ ప్రశంసలు..
India GDP | ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. చమురు ధరల షాక్లు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య ఈ వృద్ధిని సాధించడం అసాధారణమైన, అతి పెద్ద విజయమని ఆయన అభివర్ణించారు.
India GDP | ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. చమురు ధరల షాక్లు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య ఈ వృద్ధిని సాధించడం అసాధారణమైన, అతి పెద్ద విజయమని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించడం అసాధారణమైన విజయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో చమురు ధరల షాక్లు, సరఫరా వ్యవస్థ సమస్యలు ఎదురైనప్పటికీ భారత ప్రజల సమిష్టి బలం ఇంతటి వృద్ధిని సాధించేలా చేసిందని, భారత్ను విమర్శించినవారి అంచనాలు తారుమారయ్యాయని, భారత్ మరోసారి వెలిగిందని మోదీ ఎక్స్లో పోస్టులో పేర్కొన్నారు.
నాలుగు రోజుల పర్యటనలో మోదీ..
మోదీ ప్రస్తుతం నాలుగు రోజుల మధ్య-ఆసియా పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 29న ఉజ్బెకిస్థాన్ చేరుకున్న ఆయన ఆ దేశ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ద్వైపాక్షిక పర్యటనలో పాల్గొంటున్నారు. అనంతరం కిర్గిజిస్థాన్లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులోనూ ఆయన పాల్గొంటున్నారు. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తోపాటు డజనుకు పైగా దేశాల నేతలు హాజరవుతున్నారు.
https://twitter.com/NaMoInTelugu/status/2094388071966048293?s=20
గత త్రైమాసికంతో పోలిస్తే 80 పాయింట్లు తగ్గుదల..
భారత్ ఆర్థిక వ్యవస్థ 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి చెందింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రభావం ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనాలు ఉన్నప్పటికీ, తొలి త్రైమాసికంలో వృద్ధి బలంగా నమోదైంది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం వృద్ధితో పోలిస్తే తాజా వృద్ధి 80 బేసిస్ పాయింట్లు తగ్గింది.
తాజావార్తలు
- ●Bank Holidays | సెప్టెంబర్లో 15 రోజులు బ్యాంకులు బంద్.. ముఖ్యమైన తేదీలు ఇవే..
- ●Blast At Cracker Manufacturing Unit | బాణసంచా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు.. 11 మంది మృతి
- ●Niranjan Reddy | వరద జలాలే లక్ష్యంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
- ●Zomato | హైదరాబాద్లో జొమాటో ఉద్యోగులకు షాక్.. 250 మందిపై వేటు..?
- ●Kavya Kalyanram | ఇట్స్ అఫీషియల్ - బలగం హీరోయిన్తో లవ్స్టోరీని కన్ఫామ్ చేసిన కీరవాణి కొడుకు
- ●Sumitra Anand | ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణేది..? : సుమిత్రానంద్

Bank Holidays | సెప్టెంబర్లో 15 రోజులు బ్యాంకులు బంద్.. ముఖ్యమైన తేదీలు ఇవే..

Blast At Cracker Manufacturing Unit | బాణసంచా ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు.. 11 మంది మృతి

Niranjan Reddy | వరద జలాలే లక్ష్యంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

Zomato | హైదరాబాద్లో జొమాటో ఉద్యోగులకు షాక్.. 250 మందిపై వేటు..?






