India GDP | ఎఫ్వై27లో భారత ఆర్థిక వృద్ధి 7.2 శాతం.. ఈవై అంచనా..
India GDP | భారత వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 7.2 శాతం మధ్య స్థిరంగా కొనసాగే అవకాశం ఉందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) తాజా నివేదిక అంచనా వేసింది. బలమైన దేశీయ డిమాండ్, మౌలిక వసతులపై ప్రభుత్వ మూలధన వ్యయానికి కొనసాగుతున్న ప్రాధాన్యత వృద్ధికి ప్రధాన మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది.
India GDP | భారత వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 7.2 శాతం మధ్య స్థిరంగా కొనసాగే అవకాశం ఉందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) తాజా నివేదిక అంచనా వేసింది. బలమైన దేశీయ డిమాండ్, మౌలిక వసతులపై ప్రభుత్వ మూలధన వ్యయానికి కొనసాగుతున్న ప్రాధాన్యత వృద్ధికి ప్రధాన మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ఇదే సమయంలో నామమాత్ర జీడీపీ వృద్ధి 12.5 నుంచి 13 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, అధిక ముడి చమురు ధరలు, ప్రపంచ వాణిజ్య వాతావరణం బలహీనపడుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు సాపేక్షంగా బలంగానే ఉన్నాయని ఈవై తెలిపింది. పారిశ్రామిక కార్యకలాపాల్లో మెరుగుదల ఇందుకు సంకేతంగా ఉందని పేర్కొంది. భారత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి ఈ ఏడాది జూన్లో 23 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుని 7.3 శాతంగా నమోదైంది. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సగటు పారిశ్రామిక వృద్ధి 5.7 శాతానికి చేరింది. గత ఎనిమిది త్రైమాసికాల్లో ఇదే అత్యధిక వృద్ధి కావడం గమనార్హం.
బ్యాంకుల రుణ వృద్ధి మద్దతు..
తయారీ రంగం ఉత్పత్తి 7.8 శాతం పెరిగింది. విద్యుత్ పరికరాలు, మోటారు వాహనాలు, వస్త్రాలు, ఆహార ఉత్పత్తులు వంటి విభాగాలు మెరుగైన పనితీరును కనబరిచినట్లు ఈవై తెలిపింది. అయితే అధిక ఫ్రీక్వెన్సీ ఆర్థిక సూచీలు వృద్ధి వేగంలో కొంత మందగింపు కనిపిస్తున్నట్లు సూచిస్తున్నాయి. తయారీ కొనుగోలు నిర్వాహకుల సూచీ (పీఎంఐ) జూన్లో 54.2గా ఉండగా, జూలైలో 53.5కి తగ్గింది. సేవల పీఎంఐ కూడా 57.4 నుంచి 53.3కి పడిపోయింది. అయితే రెండు సూచీలు 50కి పైనే ఉండటంతో ఆర్థిక కార్యకలాపాల్లో విస్తరణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల స్థూల రుణ వృద్ధి జూన్లో 25 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుని 18.6 శాతంగా నమోదైందని ఈవై పేర్కొంది. ఆర్థిక కార్యకలాపాలకు బ్యాంకింగ్ రంగం నుంచి రుణ మద్దతు కొనసాగుతోందని ఇది సూచిస్తుందని తెలిపింది. ద్రవ్య విధాన పరంగా 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ మూలధన వ్యయ వృద్ధి గణనీయంగా పుంజుకుని 23.7 శాతానికి చేరింది. అంతకుముందు 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మూలధన వ్యయం 23.3 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ మూలధన వ్యయాన్ని పెంచడం ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తుందని ఈవై అభిప్రాయపడింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం..
అలాగే ద్రవ్య లోటు వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 18.2 శాతం వద్ద నియంత్రణలో ఉందని ఈవై తెలిపింది. ప్రభుత్వ మూలధన వ్యయం పెరగడం దేశీయ డిమాండ్ను బలోపేతం చేయడంతోపాటు వాస్తవ జీడీపీ వృద్ధి అవకాశాలను మెరుగుపరుస్తుందని పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణం కీలకమైన ప్రమాదంగా కొనసాగుతోంది. జూలైలో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 4.4 శాతంగా నమోదవగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 9.8 శాతంగా అధిక స్థాయిలో ఉంది. ఖనిజ నూనెలు, ఆహార పదార్థాలు, లోహాలు, రసాయనాలు, ఇంధన ధరలు టోకు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయని ఈవై తెలిపింది. అధిక టోకు ధరల ద్రవ్యోల్బణం నామమాత్ర జీడీపీ వృద్ధిని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేసిన 10.04 శాతం కంటే పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. దీనివల్ల ప్రభుత్వానికి పన్ను, ఇతర ఆదాయ వసూళ్లు పెరిగే అవకాశం ఉండటంతో పాటు, ద్రవ్య లోటు లక్ష్యాన్ని కొనసాగిస్తూ మూలధన వ్యయాన్ని కొనసాగించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపింది.
అంతర్జాతీయంగా కీలక సవాళ్లు..
అంతర్జాతీయ రంగంలో మాత్రం కీలకమైన సవాళ్లు కొనసాగుతున్నాయి. అధిక ఇంధన వ్యయాలు, ప్రపంచ డిమాండ్ బలహీనపడటం భారత ఎగుమతులపై ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయని ఈవై పేర్కొంది. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) అంచనాల ప్రకారం 2026-27లో భారత కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1.9 శాతానికి పెరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అయినప్పటికీ దిగుమతుల ప్రత్యామ్నాయ ఉత్పత్తి, దేశీయ విలువ జోడింపును పెంచడం ద్వారా భారత బాహ్య ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 1,272 ఉత్పత్తులపై లక్ష్యిత వ్యూహాన్ని అమలు చేస్తే సుమారు 189 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన దిగుమతులను దేశీయ ఉత్పత్తులతో భర్తీ చేసే అవకాశం ఉందని పేర్కొంది. దేశీయ తయారీని బలోపేతం చేయడంతోపాటు ఎగుమతులను ప్రోత్సహిస్తే మధ్యకాలంలో సరఫరా వ్యవస్థకు సంబంధించిన బలహీనతలను తగ్గించవచ్చని తెలిపింది.
తాజావార్తలు
- ●Youth Congress | బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత
- ●CJP September 5 March Delhi | సెప్టెంబర్ 5 కాక్రోచ్ పార్టీ ఢిల్లీ మార్చ్కు బ్రేక్ వేయలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
- ●Delhi Day Care | మూడేళ్ల చిన్నారిని కుర్చీకి కట్టేసి.. ఢిల్లీ డే కేర్లో దారుణం
- ●Chamala Kirankumar Reddy | కాంగ్రెస్ శ్రేణులారా.. వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్కు ధీటైన జవాబిద్దాం
- ●Bandi Sanjay | అభివృద్ధిలో ఆదర్శంగా కరీంనగర్
- ●vivo Y31t 5G | 7200 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. మిడ్ రేంజ్ విభాగంలో బెస్ట్..

Youth Congress | బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత

CJP September 5 March Delhi | సెప్టెంబర్ 5 కాక్రోచ్ పార్టీ ఢిల్లీ మార్చ్కు బ్రేక్ వేయలేం.. తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Delhi Day Care | మూడేళ్ల చిన్నారిని కుర్చీకి కట్టేసి.. ఢిల్లీ డే కేర్లో దారుణం

Chamala Kirankumar Reddy | కాంగ్రెస్ శ్రేణులారా.. వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్కు ధీటైన జవాబిద్దాం




