త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

PM Modi | విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు (N T Rama Rao) జయంతి నేడు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) నివాళుల‌ర్పించారు.

D

National | Published On May 28, 2026, 12.26 pm IST

PM Modi | ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ
Advertisement

PM Modi | విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు (N T Rama Rao) జయంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు నివాళుల‌ర్పిస్తున్నారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) సైతం ఎన్టీఆర్‌కు నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జా సంక్షేమం, సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న అందించిన సేవ‌ల‌ను కొనియాడారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

మహనీయులు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పేదలకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించే దిశగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి అపారమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. ప్రజల కోసం ఆయన క‌న్న క‌ల‌ల‌ను సాకారం చేసేందుకు ఎన్డీయే ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది అంటూ త‌న ట్వీట్‌లో ప్ర‌ధాని మోదీ రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

Advertisement
Advertisement