త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi Donald Trump | నావికుల భద్రతే మాకు ముఖ్యం.. జీ7 సమ్మిట్‌లో ట్రంప్‌కి తేల్చిచెప్పిన మోదీ.. నువ్వు దేవదూతవు అంటూ ఆకాశానికెత్తిన ట్రంప్

ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ. భారత నావికుల భద్రతపై చర్చ. మోదీ ఓ దేవదూత అంటూ ట్రంప్ ప్రశంసలు.

J

National | Published On Jun 17, 2026, 8.29 pm IST

PM Modi Donald Trump |  నావికుల భద్రతే మాకు ముఖ్యం.. జీ7 సమ్మిట్‌లో ట్రంప్‌కి తేల్చిచెప్పిన మోదీ.. నువ్వు దేవదూతవు అంటూ ఆకాశానికెత్తిన ట్రంప్

సంక్షిప్త సారాంశం

ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ7 (G7) సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు 16 నెలల తర్వాత వీరిద్దరూ ముఖాముఖి కలుసుకోవడం విశేషం. గల్ఫ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించిన నేపథ్యంలో, లక్షలాది మంది నావికుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి కోసం ట్రంప్ చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. ఇరాన్‌తో చేసుకోబోయే డీల్‌లో నావికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ భేటీలో మోదీని ట్రంప్ ఆకాశానికెత్తేశారు. వ్యాపారపరంగా మోదీ ఒక 'టఫ్ ట్రేడర్' (Tough trader) అని, కానీ చూడటానికి 'దేవదూత' (Angel) లా ఉంటారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

PM Modi Donald Trump | ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న జీ7 సమ్మిట్‌లో (G7 Summit) భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. దాదాపు 16 నెలల తర్వాత కలుసుకున్న ఈ ఇద్దరు అగ్ర నేతలు.. పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో (Middle East) భారత నావికుల భద్రత, స్వేచ్ఛా వాణిజ్యం (Freedom of Navigation) గురించి మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.

ముగ్గురు నావికుల మృతి.. భద్రతపై మోదీ ఫోకస్

ఇటీవల గల్ఫ్ జలాల్లో అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విపక్షాల నుంచి కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది భారతీయ సీఫేరర్స్ (Seafarers) భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ట్రంప్‌నకు మోదీ స్పష్టం చేశారు.

PM Modi Meets Trump at G7 Seafarers Safety and Angel Remark

"ప్రపంచ మారీటైమ్ ట్రేడ్‌లో పది శాతం మంది మన నావికులే ఉన్నారు. ప్రపంచ ప్రగతిలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి భద్రతతో పాటు హార్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) స్వేచ్ఛగా నౌకలు రాకపోకలు సాగించేలా చూడాల్సిన అవసరం ఉంది" అని మోదీ అన్నారు.

ఇరాన్ డీల్‌లో అదే కీలకం కావాలి

మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ తీసుకుంటున్న చొరవను ప్రధాని మోదీ అభినందించారు. త్వరలో ఇరాన్‌తో అమెరికా చేసుకోబోయే శాంతి ఒప్పందంలో (Peace agreement) నావికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ట్రంప్ సానుకూలంగా స్పందించారు. "నావికులది చాలా కఠినమైన వృత్తి అని నాకు తెలుసు. ఇలాంటి ఘటనలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కానీ ఈ ఇష్యూపై మనం కలిసే పనిచేద్దాం" అని అమెరికా అధ్యక్షుడు హామీ ఇచ్చారు.

PM Modi Meets Trump at G7 Seafarers Safety and Angel Remark

మోదీ ఓ దేవదూత: డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు

ఒకప్పుడు భారత్‌ను 'నరకం' అని, 'డెడ్ ఎకానమీ' అంటూ తీవ్ర విమర్శలు చేసిన డొనాల్డ్ ట్రంప్.. ఈ భేటీలో మాత్రం ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు. అమెరికా, భారత్ మధ్య టారిఫ్ వివాదాలు ఉన్నప్పటికీ ఈ మీటింగ్‌లో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది.

వ్యాపారపరంగా మోదీ ఒక "టఫ్ ట్రేడర్" (Tough trader) అని, కానీ చూడటానికి ఒక "ఏంజెల్" (దేవదూత) లా ఉంటారంటూ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇరు దేశాల అధికారుల బృందాలు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement