త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | వారి భ‌ద్ర‌త మ‌నంద‌రి బాధ్య‌త‌.. నావికుల మృతిపై ట్రంప్ స‌మ‌క్షంలో ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని మోదీ

PM Modi | ఒమ‌న్ తీరంలో ఓ వాణిజ్య నౌక‌పై అమెరికా జ‌రిపిన దాడిలో (US Attacks) భార‌తీయ నావికులు (Indian Sailors) ప్రాణాలు కోల్పోవ‌డంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

D

National | Published On Jun 17, 2026, 1.33 pm IST

PM Modi | వారి భ‌ద్ర‌త మ‌నంద‌రి బాధ్య‌త‌.. నావికుల మృతిపై ట్రంప్ స‌మ‌క్షంలో ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | ఒమ‌న్ తీరంలో ఓ వాణిజ్య నౌక‌పై అమెరికా జ‌రిపిన దాడిలో (US Attacks) భార‌తీయ నావికులు (Indian Sailors) ప్రాణాలు కోల్పోవ‌డంపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఫ్రాన్స్‌లో జ‌రుగుతున్న జీ7 దేశాల శిఖ‌రాగ్ర సదస్సులో (G7 Summit) అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స‌మ‌క్షంలోనే తీవ్ర నిర‌స‌న తెలిపారు. సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచడం, నావికుల భద్రతను నిర్ధారించడం ప్రపంచ దేశాల సమష్టి బాధ్యత అని నొక్కిచెప్పారు. నావికుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.

జీ7 అవుట్‌రీచ్ సెషన్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలోని కొనసాగుతున్న సంఘర్షణల వల్ల మిత్రదేశాల్లో ప్రాణ, ఆస్తి న‌ష్టాన్ని క‌లిగించింద‌న్నారు. ముఖ్యంగా హ‌ర్ముజ్ జలసంధి ద్వారా సముద్ర వాణిజ్యానికి ఏర్పడిన అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర‌ ప్రభావితం చేశాయ‌ని ప్ర‌ధాని మోదీ చెప్పుకొచ్చారు.

Also Read..

కేంద్రం నిర్ణ‌యంపై హైకోర్టులో స‌వాల్ చేసిన టెలిగ్రామ్‌

ఉద్ధ‌వ్ సేన‌లో 2022 నాటి సీన్ రిపీట్‌..?

స్మోకింగ్ వ‌దిలేసిన మెలోనీ, వాచ్ మ‌ర్చిపోయిన మాక్రాన్‌.. G7 స‌ద‌స్సులో దేశాధినేత‌ల స‌ర‌దా సంభాష‌ణ‌

Advertisement
Advertisement