PM Modi | ఎమర్జెన్సీ రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి : ప్రధాని మోదీ
PM Modi | "ఎమర్జెన్సీ మన రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి. ఆ కాలంలో పౌర హక్కుల నిలిపివేశారు. భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేశారు. మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా ఉన్న సంస్థలపై దాడులు జరిగాయి" అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో ఐదు దశాబ్దాలు (Emergency anniversary) పూర్తైన సందర్భంగా ప్రధాని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
PM Modi | 1975లో ఇందిరా గాంధీ హయాంలో దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అభివర్ణించారు. ఎమర్జెన్సీ సమయంలో పౌరుల హక్కులను నిలిపివేశారని, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు, భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా ఉన్న సంస్థలపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన, వివాదాస్పద ఘట్టంగా నిలిచిన 'అత్యవసర పరిస్థితి' (ఎమర్జెన్సీ) విధించి నేటితో ఐదు దశాబ్దాలు పూర్తైన సందర్భంగా ప్రధాని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
"ఎమర్జెన్సీ మన రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి. ఆ కాలంలో పౌర హక్కుల నిలిపివేశారు. భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేశారు. మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా ఉన్న సంస్థలపై దాడులు జరిగాయి. అదే సమయంలో మౌనంగా ఉండటానికి నిరాకరించి దేశ రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను నిలబెట్టిన వారి అసాధారణ ధైర్యాన్ని కూడా ఈ ఎమర్జెన్సీ గుర్తుచేసింది. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులకు ఒక సజీవ రూపం. రాజ్యాంగ విలువలను కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. రాజ్యాంగం స్ఫూర్తితో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే దేశాన్ని నిర్మిస్తాం. సంవిధాన్ హత్యా దివస్ ఎమర్జెన్సీ నాటి చీకటి కాలాన్ని అందరికీ గుర్తు చేస్తుంది" అని ప్రధాని తన ట్వీట్లో రాసుకొచ్చారు.
Today, we pay homage to all those who steadfastly defended democratic values during one of the darkest chapters in India’s history, the Emergency.
The Emergency was a direct assault on our Constitution. It witnessed the suspension of civil liberties, curbs on freedom of…
— Narendra Modi (@narendramodi) June 25, 2026
ప్రధాన మంత్రితోపాటూ పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు సైతం ఎమర్జెన్సీ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 1975 నాటి ఎమర్జెన్సీని భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్నవారు నిరంకుశంగా మారినప్పుడు పౌరుల ప్రాణాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు, రాజ్యాంగ విలువలకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని ఎమర్జెన్సీ మనకు గుర్తు చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచిన వారందరికీ దేశం రుణపడి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని, బలోపేతం చేయాలని, గౌరవించుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
संविधान हत्या दिवस आज हमें उस काले दौर की याद दिला रहा है, जब भारतीय लोकतंत्र को बुरी तरह से कुचला गया था। यह हमें लोकतंत्र, संविधान और नागरिक अधिकारों की रक्षा के लिए हमेशा प्रतिबद्ध रहने को प्रेरित करता है। आपातकाल का विरोध करने वाली सभी विभूतियों को सादर नमन।
स्वातन्त्र्यात्… pic.twitter.com/hBr3DzrtsR
— Narendra Modi (@narendramodi) June 25, 2026
On this day in 1975, the Emergency was imposed in India. The Emergency remains one of the darkest chapters in the history of Indian democracy. During that period, freedom of speech and expression was curtailed, attempts were made to control and undermine the judiciary, and the…
— Rajnath Singh (@rajnathsingh) June 25, 2026
సంబంధిత వార్తలు

Emergency | ఎన్సీఈఆర్టీ చరిత్రాత్మక నిర్ణయం.. 9వ తరగతి బుక్లో ఎమర్జెన్సీపై పాఠం
జూన్ 25, 2026

Ayatollah Ali Khamenei funeral | జులై 9న ఖమేనీ అంత్యక్రియలు.. మోదీని ఆహ్వానించిన ఇరాన్..!
జూన్ 24, 2026

Chiranjeevi | రామ్ చరణ్పై ప్రధాని మోదీ ప్రశంసలు.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన చిరంజీవి
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●Anand Mahindra | వృద్ధ కళాకారుడికి అండగా నిలిచి.. ఔదార్యత చాటుకున్న ఆనంద్ మహీంద్రా
- ●Maharashtra FDA | పేపర్లో ఆహారం ఇస్తే కఠిన చర్యలు.. మహారాష్ట్రలో కొత్త ఫుడ్ సేఫ్టీ నిబంధనలు..
- ●Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ●Motilal Oswal | టెక్స్టైల్ షేర్లపై మోతీలాల్ ఒస్వాల్ బుల్ సెంటిమెంట్.. ఈ 5 స్టాక్స్కు బై రేటింగ్..
- ●Rajya Sabha MPs | 31 శాతం మంది రాజ్యసభ ఎంపీలపై క్రిమినల్ కేసులు.. రూ..5,300 కోట్ల ఆస్తితో తెలంగాణ ఎంపీ టాప్
- ●SBI | ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. స్థానిక భాష తెలిసినవారికి ప్రాధాన్యం

Anand Mahindra | వృద్ధ కళాకారుడికి అండగా నిలిచి.. ఔదార్యత చాటుకున్న ఆనంద్ మహీంద్రా

Maharashtra FDA | పేపర్లో ఆహారం ఇస్తే కఠిన చర్యలు.. మహారాష్ట్రలో కొత్త ఫుడ్ సేఫ్టీ నిబంధనలు..

Revanth Reddy | 28న నల్లగొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Motilal Oswal | టెక్స్టైల్ షేర్లపై మోతీలాల్ ఒస్వాల్ బుల్ సెంటిమెంట్.. ఈ 5 స్టాక్స్కు బై రేటింగ్..



