త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Melodi | మా జంట సోష‌ల్ మీడియాలో చాలా ఫేమ‌స్‌: జార్జియా మెలోనీ

Melodi | త్రినేత్ర‌.న్యూస్‌: ఫ్రాన్స్‌లోని ఎవియ‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న జీ7 (G7) స‌ద‌స్సులో ఆస‌క్తిక‌ర‌మ ప‌రిణామం చోటుచేసుకుంది. జీ7 స‌ద‌స్సుకు అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్, ఇట‌లీ త‌దిత‌ర దేశాల అధినేత‌లు హాజ‌ర‌య్యారు.

G

International | Published On Jun 17, 2026, 7.08 am IST

Melodi | మా జంట సోష‌ల్ మీడియాలో చాలా ఫేమ‌స్‌: జార్జియా మెలోనీ
Advertisement

Melodi | త్రినేత్ర‌.న్యూస్‌: ఫ్రాన్స్‌లోని ఎవియ‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న జీ7 (G7) స‌ద‌స్సులో ఆస‌క్తిక‌ర‌మ ప‌రిణామం చోటుచేసుకుంది. జీ7 స‌ద‌స్సుకు అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్, ఇట‌లీ త‌దిత‌ర దేశాల అధినేత‌లు హాజ‌ర‌య్యారు. ఇట‌లీ ప్ర‌ధాని జార్జియా మెలోనీతో ప్ర‌ధాని మోదీ అన్న మాట‌లు అత్యంత చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఫ్యామిలీ ఫొటో సంద‌ర్భంగా మెలోనితో మాట్లాడుతూ `మీరు ఇన్‌స్టాగ్రామ్ చూశారా?` అని మోదీ అడిగారు.. దీనికి ఆమె `మా జంట‌ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమ‌స్‌` అని చెప్పారు. దీంతో అక్క‌డున్న‌వారంతా ఒక్క‌సారిగా న‌వ్వులు చిందించారు.

ప్ర‌ధాని మోదీ, ఇట‌లీ పీఎం మెలోని మ‌ధ్య మంచి స్నేహం ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో వారిరువురి పేర్ల‌ను క‌లిసి మెలోడీ (Meloni + Modi = Melodi)అని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో మీమ్స్, జోకులు పేలుస్తూ ఉంటారు. 2023లో దుబాయ్‌లో జరిగిన COP28 సదస్సు సందర్భంగా మెలోని పోస్ట్ చేసిన ఒక సెల్ఫీ ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ ట్రెండ్‌గా మారింది. ప్రధాని మోదీతో కలిసి ఉన్న ఒక ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్టుచేసిన ఆమె.. దానికి `COP28లో మంచి స్నేహితులు #మెలోడీ (#Melodi) అని క్యాప్షన్ పెట్టారు. ఆ హ్యాష్‌ట్యాగ్ వెంటనే చాలా ప్రాచుర్యం పొందింది. దీంతో అది గ‌త మూడేండ్లుగా ఆన్‌లైన్‌లో ఒక బ్రాండ్‌గా మారింది. అప్ప‌టి నుంచి ఈ ఇద్ద‌రు నేత‌లు ఎక్క‌డ క‌లిసినా వారి ఫొటోలు ఇంర్నెట్ సెన్సేష‌న్‌గా మారుతుంటాయి.

ఇటీవ‌ల ఇట‌లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప్ర‌ధాని మోదీ.. పార్లే ప్రొడక్ట్స్‌కు చెందినటువంటి మెలోడీ టాఫీని గిఫ్ట్‌గా మెలోనీకి ఇచ్చారు. దానిని ఆమె స్వయంగా ఆ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వెరీ వెరీ గుడ్ టాఫీ అని మెలోనీ చెప్పడం.. దానికి మోదీ మెలోడీ అని సమాధానం ఇవ్వడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వ్యాపించింది. మీమ్స్ ట్రెండ్ మొదలైంది. కేవలం 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 175 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఇంటర్నెట్‌ను ఊపేసింది. ప్రస్తుతం దీనికి కోటీ 30 ల‌క్ష‌ల‌కుపైగా (13 మిలియన్లు) లైక్స్ వచ్చాయి.

3 గంటల వ్యవధిలోనే ఏకంగా 40 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఇప్ప‌టి వ‌రకు ఆ వీడియోను కోటి మందికి పైగా లైక్ చేశారు. ఇదే విష‌యాన్ని జీ7 సద‌స్సులో మెలోని వ‌ద్ద‌ ప్ర‌ధాని మోదీ ప్ర‌స్తావించారు. దీనికి ప్ర‌తిగా `మేము ఇప్పుడు ఇన్‌స్టాలో అత్యంత ప్ర‌జాధ‌ర పొందిన‌ జంట` అని వ్యాఖ్యానించారు. దీంతో అక్క‌డ నవ్వులు విర‌బూశాయి. మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది! అని కూడా మోదీతో ఆమె అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement