త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

National Law School | సీజేఐపై విద్యార్థుల‌ ఆగ్రహ ఫలితం.. స్నాత‌కోత్స‌వాన్ని ర‌ద్దు చేసిన నేషనల్ లా స్కూల్

National Law School | బెంగ‌ళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (The National Law School of India University) సెప్టెంబ‌ర్ 12న జ‌ర‌గాల్సిన త‌న 34వ వార్షిక స్నాత‌కోత్స‌వాన్ని ర‌ద్దు చేసింది. కార్య‌క్ర‌మానికి సీజేఐ హాజ‌రును (CJI Justice Surya Kant) వ్య‌తిరేకిస్తూ విద్యార్థులు నిర‌స‌న వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో అనివార్య ప‌రిస్థితుల‌ను కార‌ణంగా చూపుతూ వ‌ర్సిటీ త‌న‌ నిర్ణ‌యం వెలువ‌రించింది.

D

National | Published On Aug 27, 2026, 3.10 pm IST

National Law School | సీజేఐపై విద్యార్థుల‌ ఆగ్రహ ఫలితం.. స్నాత‌కోత్స‌వాన్ని ర‌ద్దు చేసిన నేషనల్ లా స్కూల్
Advertisement

National Law School | త్రినేత్ర‌.న్యూస్ : నిరుద్యోగుల్ని బొద్దింక‌ల‌తో పోలుస్తూ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్యకాంత్ (CJI Justice Surya Kant) చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల లా విద్యార్థులు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ క‌ళాశాల‌ల్లో నిర్వ‌హించే స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మానికి సీజేఐ రావ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. ఇప్ప‌టికే ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ (Tata Institute of Social Sciences), హైద‌రాబాద్ న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థులు సీజేఐకు రాక‌ను వ్య‌తిరేకించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయా వ‌ర్సిటీలు త‌మ స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మాల‌ను చివ‌రి నిమిషంలో ర‌ద్దు చేసుకున్నాయి. తాజాగా విద్యార్థుల‌ ఆగ్రహ ఫలితంగా మ‌రో వ‌ర్సిటీ కూడా అలాంటి నిర్ణ‌య‌మే తీసుకోవాల్సి వ‌చ్చింది.

బెంగ‌ళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (The National Law School of India University) సెప్టెంబ‌ర్ 12న జ‌ర‌గాల్సిన త‌న 34వ వార్షిక స్నాత‌కోత్స‌వాన్ని ర‌ద్దు చేసింది. ఈ ఈ వెంట్‌కు సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌తోపాటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ మ‌న‌న్ కుమార్ మిశ్రా ( Bar Council of India Chairman Manan Kumar Mishra ) హాజ‌రుకావాల్సి ఉంది. అయితే, వారి రాక‌ను వ్య‌తిరేకిస్తూ విద్యార్థులు నిర‌స‌న వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో అనివార్య ప‌రిస్థితుల‌ను కార‌ణంగా చూపుతూ వ‌ర్సిటీ త‌న‌ నిర్ణ‌యం వెలువ‌రించింది. కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు విద్యార్థుల‌కు స‌మాచారం అందించింది. అయితే, వేడుకను ర‌ద్దు చేసినా.. విద్యార్థుల‌కు మాత్రం డిగ్రీ ప‌ట్టాల‌ను అందిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇందుకోసం విద్యార్థులు తమ డిగ్రీలను స్వ‌యంగా అందుకోవ‌డానికి స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిన అవసరం లేద‌ని తెలిపింది. త‌మ ప‌ట్టాల‌ను కొరియ‌ర్ ద్వారా లేదా యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోనే తీసుకోవ‌డానికి అవ‌కాశం క‌ల్పించింది.

Also Read..

ఒలింపిక్స్‌లో భార‌త భాగ‌స్వామ్యం పెర‌గాలి : ప్ర‌ధాని మోదీ

హిమాలయాలకు ముప్పు

పాలిటిక్స్‌లోకి విశ్వ‌క్‌సేన్ - లెగ‌సీ రిలీజ్‌పై అప్‌డేట్‌

Advertisement
Advertisement