త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallikarjun Kharge | ప్ర‌ధాని మోదీని ఉగ్ర‌వాదితో పోల్చిన ఖ‌ర్గే.. వివాదం ముద‌ర‌డంతో వివ‌ర‌ణ ఇచ్చిన కాంగ్రెస్ చీఫ్‌

Mallikarjun Kharge | కాంగ్రెస్ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వివాదంలో చిక్కుకున్నారు. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని ఉగ్ర‌వాదితో పోల్చారు. ఏఐఏడీఎంకే పార్టీ మోదీతో ఎలా కలుస్తోంది..? అంటూ ప్ర‌శ్నించారు.

D

National | Published On Apr 21, 2026, 6.06 pm IST

Mallikarjun Kharge | ప్ర‌ధాని మోదీని ఉగ్ర‌వాదితో పోల్చిన ఖ‌ర్గే.. వివాదం ముద‌ర‌డంతో వివ‌ర‌ణ ఇచ్చిన కాంగ్రెస్ చీఫ్‌
Advertisement

Mallikarjun Kharge | ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)ని ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోదీని ఉగ్ర‌వాదితో (Terrorist) పోల్చి వివాదంలో చిక్కుకున్నారు. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో చెన్నైలో జరిగిన మీడియా స‌మావేశంలో ఖ‌ర్గే ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో క‌లిసి పోటీ చేయ‌డంపై ఖ‌ర్గే ప్ర‌శ్నించారు. ''ఏఐఏడీఎంకే పార్టీ మోదీతో ఎలా కలుస్తోంది..? అయ‌న (మోదీని ఉద్దేశించి) ఒక ఉగ్రవాది. ఆయనకు సమానత్వంపై నమ్మకం లేదు. ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని నమ్మదు. ఇలాంటి వారితో ఏఐఏడీఎంకే కలుస్తోంది అంటే వీళ్లు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం'' అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-డీఎంకే నేతృత్వంలోని కూట‌మిని గెలిపించాలి అభ్య‌ర్థించారు. ఆయ‌న‌ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఖ‌ర్గే వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ధాని మోదీకి ఖ‌ర్గే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ముదురుతున్న నేప‌థ్యంలో త‌న వ్యాఖ్య‌ల‌పై ఖ‌ర్గే వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌ధాని మోదీని తాను ఉగ్రవాది అని అనలేదన్నారు. ప్రజలను, రాజ‌కీయ పార్టీల‌ను ఆయ‌న‌ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాత్రమే అన్నానంటూ చెప్పుకొచ్చారు. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలసిందే. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అక్క‌డ ప‌ర్య‌టిస్తున్న ఖ‌ర్గే.. ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

Also Read..

వ‌చ్చేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే.. త‌ప్పులు స‌రిదిద్దుకోవాలి..

మ‌ళ్లీ యాక్టివ్ అయిన గులాబీ బాస్‌.. ఈనెల 27న బీఆర్ఎస్ నేత‌లతో కీలక భేటీ

కేసీఆర్ చేతిలో జీవన్ రెడ్డి మోసపోవడం ఖాయం : ఎంపీ మల్లు రవి ఘాటు విమర్శలు

Advertisement
Advertisement