త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | కొవిడ్ త‌ర‌హాలోనే.. ఎల్పీజీ సంక్షోభాన్ని మ‌నం అధిగ‌మిస్తాం : ప్ర‌ధాని మోదీ

PM Modi | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కొవిడ్ (Covid) మ‌హ‌మ్మారి స‌మ‌యంలో మాదిరిగానే మిడిల్ ఈస్ట్‌ ఉద్రిక్త‌త‌ల వ‌ల్ల త‌లెత్తిన ఎల్పీజీ సంక్షోభాన్ని (LPG crisis) భార‌త్ అధిగ‌మిస్తుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

D

National | Published On Mar 13, 2026, 10.38 am IST

PM Modi | కొవిడ్ త‌ర‌హాలోనే.. ఎల్పీజీ సంక్షోభాన్ని మ‌నం అధిగ‌మిస్తాం : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కొవిడ్ (Covid) మ‌హ‌మ్మారి స‌మ‌యంలో మాదిరిగానే మిడిల్ ఈస్ట్‌ ఉద్రిక్త‌త‌ల వ‌ల్ల త‌లెత్తిన ఎల్పీజీ సంక్షోభాన్ని (LPG crisis) భార‌త్ అధిగ‌మిస్తుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ప‌రిస్థితిని చ‌క్కదిద్దేందుకు, అంత‌రాయాల భారాన్ని భార‌తీయుల‌పై ప‌డ‌కుండా చూసేందుకు ప్ర‌భుత్వం బ‌హుముఖ వ్యూహాల‌తో ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. ఈ మేర‌కు గురువారం NXT సమ్మిట్‌ను ఉద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

"140 కోట్ల మంది భారతీయులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కొవిడ్ మ‌హ‌మ్మారి సమయం మాదిరిగానే మ‌నం ఈ సంక్షోభాన్ని కూడా అధిగమిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాల వల్ల మన పౌరులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోకూడదనేదే మా స్పష్టమైన సంకల్పం" అని ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా బ్లాక్‌మార్కెట్‌, అక్ర‌మ నిల్వ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ప‌రిస్థితిని ఆస‌రాగా చేసుకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారిని అడ్డుకునేందుకు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప్ర‌ధాని కోరారు. నిఘాను పెంచాల‌ని సూచించారు.

ఇంధ‌న భ‌ద్ర‌త‌ను కాపాడుకునేందుకు చ‌ర్య‌లు..

ఇక ప‌శ్చిమాసియాలో యుద్ధ వాతావ‌ర‌ణం ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంద‌ని ప్ర‌ధాని తెలిపారు. ఇంధ‌న సంక్షోభానికి దారితీసింద‌ని వ్యాఖ్యానించారు. భార‌త్ త‌న ఇంధ‌న భ‌ద్ర‌త‌ను కాపాడుకునేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. స‌ర‌ఫ‌రా గొలుసులో త‌లెత్తిన అంత‌రాయాల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని.. గ్లోబల్ లీడర్స్‌తో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని తెలిపారు.

భార‌త్ స్థిరంగా ముందుకు సాగుతోంది..

2014కు ముందు దేశంలో ఇథనాల్ (Ethanol blending) సామర్థ్యం కేవలం 1-1.5 శాతం మాత్రమే ఉండేదని ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అది నేడు 20 శాతానికి చేరింద‌ని తెలిపారు. ప్ర‌పంచవ్యాప్తంగా త‌లెత్తే సంక్షోభాల‌ను ఎదుర్కొనేందుకు భార‌త్ త‌న వ్యూహాత్మ‌క పెట్రోలియం నిల్వ‌ల‌ను, ఇంధ‌న మౌలిక స‌దుపాయాల‌ను భారీగా విస్త‌రించిన‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు సుమారు 50 లక్షల టన్నులకు పైగా ఉన్నాయని, అలాగే 2014లో 14 కోట్లుగా ఉన్న ఎల్పీజీ (LPG) కనెక్షన్ల సంఖ్య ఇప్పుడు 33 కోట్లకు పెరిగిందని ప్ర‌ధాని వివ‌రించారు. గ‌త ద‌శాబ్ద కాలంలో దేశంలో గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వ‌ర్క్‌లు, ఎల్‌ఎన్‌జీ (LNG) టెర్మినల్స్‌, ఎల్పీజీ పంపిణీ మౌలిక స‌దుపాయాల‌ను గ‌ణ‌నీయంగా విస్త‌రించిన‌ట్లు గుర్తు చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌వాళ్లు ఉన్న‌ప్ప‌టికీ భార‌త్ స్థిరంగా ముందుకు సాగుతోంద‌ని, ప్రపంచ వృద్ధికి కీలక చోదక శక్తిగా నిలుస్తోందని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.

Also Read..

Mojtaba Khamenei | అమెరికా దాడిలో కాలు కోల్పోయి.. కోమాలో ఇరాన్ నూత‌న సుప్రీం లీడ‌ర్ మొజ్తాబా ఖమేనీ..?

Sunrisers | సన్ రైజ‌ర్స్ యాజ‌మాన్యానికి షాక్‌.. పాక్ ప్లేయ‌ర్‌ను కొన్న అనంత‌రం ఎక్స్ ఖాతా స‌స్పెన్ష‌న్‌..

US Aircraft Crash | అమెరికాకు మ‌రో ఎదురుదెబ్బ‌.. ఇరాక్‌లో కుప్ప‌కూలిన సైనిక విమానం

Advertisement
Advertisement