Rajnath Singh | సింధూర్లో సైనికులెవరూ అమరులు కాలేదంటూ ప్రకటన.. రాజ్నాథ్పై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
Rajnath Singh | గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్లో (Operation Sindoor) భారత సైనికులెవరూ మరణించలేదంటూ ప్రకటించి లోక్సభను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)పై కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రివిలేజ్ నోటీసు (privilege notice) ఇచ్చింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఈ నోటీసును లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు.
Rajnath Singh | రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)పై కాంగ్రెస్ ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది. గతేడాది జరిగిన 'ఆపరేషన్ సింధూర్' (Operation Sindoor)లో భారత సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లోక్సభ స్పీకర్కు ఈ నోటీసును అందజేశారు. లోక్సభ నియమ నిబంధనల్లోని రూల్ 223 కింద రక్షణ మంత్రిపై ప్రివిలేజ్ చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్పై 2025 జులై 28న పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఈ ఆపరేషన్లో భారత సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని రాజ్నాథ్ సభకు తెలిపారని కేసీ పేర్కొన్నారు. అయితే, ఆ సైనిక ఆపరేషన్లో సాయుధ దళాలకు చెందిన ఆరుగురు సిబ్బంది మరణించినట్లు ప్రభుత్వం ఆ తర్వాత అధికారికంగా వెల్లడించిందని గుర్తు చేశారు. మరణాల గురించిన సమాచారాన్ని దాచడం ఆ సైనికుల కుటుంబాలను, సాయుధ దళాలను అవమానించడమే అవుతుందన్నారు.
"గతేడాది పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై జరిగిన చర్చ సమయంలో రాజ్నాథ్ భారత ప్రజలకు అబద్ధం చెప్పారు. ఆపరేషన్లో ఏ ఒక్క భారతీయ సైనికుడూ అమరుడు కాలేదని ఆయన ఎలా చెప్పారు..? ఆ తర్వాత ఆరుగురు జవాన్లను కోల్పోయామని సాయుధ దళాలు అధికారికంగా ఎలా ప్రకటిస్తాయి..? ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సభలో మంత్రి ఇచ్చిన ప్రకటన స్పష్టంగా తప్పుదోవ పట్టించేదిగా ఉంది. పార్లమెంటును తప్పుదోవ పట్టించడం లేదా సమాచారాన్ని దాచడం అనేది సభా హక్కుల ఉల్లంఘన, సభను ధిక్కరించడమే అవుతుంది. రాజ్నాథ్పై సభా ఉల్లంఘన చర్యలు తీసుకోవాలి" అని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Ramchandar Rao | కాంగ్రెస్.. పీవీని ఎప్పుడూ గౌరవించలే: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
జూన్ 28, 2026

KTR | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయినట్లు అనిపిస్తోంది : కేటీఆర్
జూన్ 27, 2026

MLA Rammohan Reddy | పరిగిలో కేటీఆర్ మీటింగ్.. లేచి వెళ్లిపోయిన జనం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Mahesh Babu | మహేష్ బాబు ఏఎమ్బీ మల్టీప్లెక్స్కు 35 లక్షల ఫైన్ - రూమర్లపై క్లారిటీ ఇదిగో!
- ●CM Revanth Reddy | రైతు భరోసా కింద రూ. 36 వేల కోట్లు అందించాం : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | నీ అయ్య జాగీరా దిగిపోవడానికి : సీఎం రేవంత్ రెడ్డి
- ●E20 Petrol | ఈ20 పెట్రోల్పై ప్రయోగాత్మక అధ్యయనం.. సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం..!
- ●Collector Manu Choudary | నాతో ఐదారు మంది సీసీలు పని చేశారు.. అందులో భాస్కర్ చాలా బెస్ట్: కలెక్టర్ ప్రశంస
- ●Rahul Ravindran | ది గర్ల్ఫ్రెండ్ మూవీ.. రష్మికను పుణే సియా గోయల్తో పోల్చిన నెటిజన్లు.. ఎక్స్ యాప్ డిలీట్ చేసిన డైరెక్టర్

Mahesh Babu | మహేష్ బాబు ఏఎమ్బీ మల్టీప్లెక్స్కు 35 లక్షల ఫైన్ - రూమర్లపై క్లారిటీ ఇదిగో!

CM Revanth Reddy | రైతు భరోసా కింద రూ. 36 వేల కోట్లు అందించాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | నీ అయ్య జాగీరా దిగిపోవడానికి : సీఎం రేవంత్ రెడ్డి

E20 Petrol | ఈ20 పెట్రోల్పై ప్రయోగాత్మక అధ్యయనం.. సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం..!



