త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jharkhand | ఏం క‌ష్ట‌మొచ్చిందో.. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను బావిలో ప‌డేసి.. తానూ దూకిన త‌ల్లి

Jharkhand | కుటుంబ త‌గాదాల‌తో (Domestic Dispute) త‌న‌ ఇద్ద‌రు పిల్ల‌ల‌ను బావిలో (Well) ప‌డేసిన త‌ల్లి.. తానూ ఆత్మ‌హ‌త్య‌కు (Suicied) య‌త్నించింది. అయితే ఆ ఇద్ద‌రు పిల్ల‌ల నీటిలో మునిగి చ‌నిపోగా, త‌ల్లిని గ్రామ‌స్తులు కాపాడిన ఘ‌ట‌న జార్ఖండ్‌లోని (Jharkhand) ప‌లాము (Palamu) జిల్లాలో జ‌రిగింది.

G

National | Published On Jul 10, 2026, 10.36 am IST

Jharkhand | ఏం క‌ష్ట‌మొచ్చిందో.. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను బావిలో ప‌డేసి.. తానూ దూకిన త‌ల్లి
Advertisement

Jharkhand | త్రినేత్ర‌.న్యూస్‌: కుటుంబ త‌గాదాల‌తో (Domestic Dispute) త‌న‌ ఇద్ద‌రు పిల్ల‌ల‌ను బావిలో (Well) ప‌డేసిన త‌ల్లి.. తానూ ఆత్మ‌హ‌త్య‌కు (Suicied) య‌త్నించింది. అయితే ఆ ఇద్ద‌రు పిల్ల‌ల నీటిలో మునిగి చ‌నిపోగా, త‌ల్లిని గ్రామ‌స్తులు కాపాడిన ఘ‌ట‌న జార్ఖండ్‌లోని (Jharkhand) ప‌లాము (Palamu) జిల్లాలో జ‌రిగింది.

ప‌లాము జిల్లాలోని కాండాకు చెందిన స‌రితా దేవి, ఛోటే లాల్ ప్ర‌జాప‌తి భార్యాభ‌ర్త‌లు. వారికి ముగ్గురు ఆడ‌పిల్ల‌లు. ఛోటే లాల్ స్థానికంగా కూలిప‌నులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే బుధ‌వారం రాత్రి భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా పెద్ద‌ది కావ‌డంతో నాన‌మ్మ ఒడిలో నిద్రిస్తున్న రెండున్న‌రేండ్ల వ‌య‌స్సున్న చిన్న కూతురితో స‌హా త‌న ముగ్గురు పిల్ల‌ల‌ను తీసుకుని ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ స‌రితా దేవి.. గ్రామంలోని ఓ బావి వ‌ద్ద‌కు చేరుకుంది. మొద‌ట చిన్న కూతురు డాలీని బావిలో విసిరేసింది. త‌ర్వాత నాలుగేండ్ల ప్రియ‌ను ప‌డేసింది. అనంత‌రం ఆరేండ్ల పెద్ద కూతురు సుష్మ‌ను కూడా బావిలోకి ప‌డేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. ఆ బాలిక ప్ర‌తిఘ‌టించింది. ర‌క్షించాలంటూ గ‌ట్టిగా అరిచింది. దీంతో ఆ ప్ర‌య‌త్నాన్ని విరమించుకున్న సరిత‌.. సుష్మ‌ను అక్క‌డే వ‌దిలేసి, తాను బావిలో దూకింది.

అయితే సుష్మ అరుపులు విన్న గ్రామ‌స్తులు.. బావి వ‌ద్ద‌కు వ‌చ్చి సుష్మ‌ను ప్రాణాల‌తో కాపాడారు. అయితే అప్ప‌టికే నీట‌మునిగి ఇద్ద‌రు చిన్న కూతుర్లు మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని.. సరితా దేవిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌డంతో న్యాయ‌మూర్తి ఆమెకు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు దారితీసిన అంశాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement