త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | వ్యాన్‌ను ఢీకొట్టిన బొగ్గులారీ.. బ్యాండ్​ బృందంలోని ఏడుగురు మృతి

Road Accident | వారంతా ఓ బ్యాండు మేళంలో స‌భ్యులు. ఓ వేడుకలో పాల్గొని ఆహుతుల‌ను ఉత్తేజ‌ప‌రిచారు. కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత తిరుగు ప‌య‌ణ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఎదురుగా వ‌చ్చిన బోగ్గు లారి వారికి మృత్యుశ‌క‌ట‌మైంది.

G

National | Published On Jun 26, 2026, 10.02 am IST

Road Accident | వ్యాన్‌ను ఢీకొట్టిన బొగ్గులారీ.. బ్యాండ్​ బృందంలోని ఏడుగురు మృతి
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: వారంతా ఓ బ్యాండు మేళంలో స‌భ్యులు. ఓ వేడుకలో పాల్గొని ఆహుతుల‌ను ఉత్తేజ‌ప‌రిచారు. కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత తిరుగు ప‌య‌ణ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఎదురుగా వ‌చ్చిన బోగ్గు లారి వారికి మృత్యుశ‌క‌ట‌మైంది. అప్ప‌టివ‌ర‌కు త‌మ క‌ళ‌తో ఆహుతుల‌ను ఉత్తేజ‌ప‌రిచిన వారిని లారీ బ‌లితీసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న (Road Accident) జార్ఖండ్‌లోని (Jharkhand) రామ్‌గఢ్ జిల్లాలో గురువారం అర్ధ‌రాత్రి జ‌ర‌గింది.

రామ్‌గ‌ఢ్ జిల్లాలోని బ‌ల్స‌గ‌రా ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు, మారంగ్‌మ‌ర్చా గ్రామానికి చెందిన బ్యాండ్, తాషా బృందానికి చెందిన ఐగుగురు స‌భ్యులు ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వ్యానులో వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మొత్తం అంతా ఒకే వాహనంలో తిరిగి బల్సగరా వైపు బయలుదేరారు. ఈ క్ర‌మంలో రామ్‌గ‌ఢ్ఇ-బొకారో జాతీయ ర‌హదారిపై (NH 23) బ‌ర్లౌంగ్ స‌మీపంలో రామ్‌గఢ్ వైపు నుంచి వేగంగా వస్తున్న బొగ్గు లారీ మ‌రో వాహ‌నాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చిన వ్యానును ఢీకొట్టింది. దీంతో వ్యాను పూర్తిగా ధ్వంసమైంది. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అందులో ప్ర‌యాణిస్తున్న‌ ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయ‌పడిన మ‌రొక‌రిని పోలీసులు రాంచీలోని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు.

Advertisement
Advertisement