త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prashanth Kishore | ఉప ఎన్నిక‌ల బ‌రిలో ప్ర‌శాంత్ కిశోర్.. బీజేపీ కంచుకోట‌లో గెలిచేనా..?

Prashanth Kishore | జ‌న్ సూర‌జ్ పార్టీ అధినేత ప్ర‌శాంత్ కిశోర్( Prashanth Kishore ) ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి కంచుకోట‌గా ఉన్న బంకీపూర్( Bankipur ) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం(బీహార్) నుంచి ప్ర‌శాంత్ కిశోర్ బ‌రిలో దిగ‌నున్నారు.

S

National | Published On Jul 5, 2026, 4.25 pm IST

Prashanth Kishore | ఉప ఎన్నిక‌ల బ‌రిలో ప్ర‌శాంత్ కిశోర్.. బీజేపీ కంచుకోట‌లో గెలిచేనా..?
Advertisement

Prashanth Kishore | త్రినేత్ర‌.న్యూస్ : జ‌న్ సూర‌జ్ పార్టీ అధినేత ప్ర‌శాంత్ కిశోర్( Prashanth Kishore ) ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి కంచుకోట‌గా ఉన్న బంకీపూర్( Bankipur ) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం(బీహార్) నుంచి ప్ర‌శాంత్ కిశోర్ బ‌రిలో దిగ‌నున్నారు. ఈ మేర‌కు జ‌న్ సూర‌జ్ పార్టీ( Jan Suraaj Party ) బీహార్ అధ్య‌క్షుడు మ‌నోజ్ భార‌తి అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఆలోచించి ఓటేయండి..

ఈ ఉప ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని, భారీ మెజార్టీతో గెలిపించాల‌ని బంకీపూర్ ప్ర‌జ‌ల‌ను ప్ర‌శాంత్ కిశోర్ కోరారు. బంకీపూర్ ప్ర‌జ‌ల్లో చాలా మంది ధ‌న‌వంతులు, విద్యావంతులు ఉన్నారు. కాబ‌ట్టి ఓటు ఎవ‌రికి వేస్తే మేలు జ‌రుగుతుందో ఆలోచించి ఓటేయాలి. నేను స‌రైన అభ్య‌ర్థినని ప్ర‌జ‌లు భావిస్తే ఈ ఉప ఎన్నిక‌ల్లో నాకు ఓటేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను అని ప్ర‌శాంత్ కిశోర్ పేర్కొన్నారు.

నితిన్ న‌బీన్ రాజీనామాతో..

బంకీపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌పున గెలుపొందిన నితిన్ న‌బీన్ ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా నియామ‌కం అయ్యారు. అనంత‌రం ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన నితిన్ రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. దీంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ నెల 30వ తేదీన బంకీపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఆగ‌స్టు 3న ఫ‌లితం వెలువ‌డ‌నుంది. అయితే ఈ స్థానానికి ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం..

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలిసారిగా పోటీ చేసిన జ‌న్ సూర‌జ్ పార్టీ ఘోర ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. తాను పోటీ చేయకపోయినప్పటికీ తన పార్టీ జన్‌ సురాజ్‌ తరఫున పోటీ చేసిన ఒక్క అభ్యర్థినీ గెలిపించలేకపోయారు. 243 స్థానాలకు గానూ 238 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఒక్కసీటులోనూ ఆ పార్టీ గెలవలేకపోయింది. దీంతో అప్పట్లో ఓటమికి బాధ్యత వహిస్తూ మౌనవ్రతం కూడా చేశారు.

Advertisement
Advertisement